ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 14

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 13

 

తిరుప్పావై జీయర్

               తిరువరగంగత్తముదనార్, స్వామి రామానుజులను “చూడికొడుత్తవళ్  తోల్ అరుళాల్ వాళ్గిన్ర వళ్లల్” (ఆండాళ్ అనుగ్రహ సంపన్నులు) అని కొనియాడేవారు. స్వాభావిక కృపా సంపన్నురాలైయన ఆండాళ్ వలన రామానుజులు ఉజ్జివించారని వారి అభిప్రాయం. తిరుప్పావైలోని పద్దెనిదవ పాశుసురానికి సంబంధించిన ఐతిహ్యం ఒకటి ఉంది. దాని వలననే  స్వామి రామానుజులు తిరుప్పావై జీయర్ గా  కొనియాడబడుతున్నారు.

స్వామి రామానుజుల మీద తిరుప్పావై ప్రభావాన్ని తెలిపే ఉదంతాన్ని ఇక్కడ చూద్దాం.

భగవధ్గీత ౩వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పినప్పుడు  ఇలా చెప్పారు.

 ” యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవేతరో జనః

స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” ( 3-21)

‘సామాన్య అర్థంలో చూస్తె ఈ శ్లోకంలో విశేషం ఏమి కనపడదు, కానీ తెరచి చూస్తే  మంచివారి నడవడి, శీలము గురించి చెప్ప బడిందని బోధపడుతుంది.  ఈ శ్లోకంలోని రెండవ పాదాన్ని శంకర భగవత్పాదులు

“సః శ్రేష్టాః యత్ ప్రమాణం కురుతే – లౌకికం వైదికం వా, లోకాః తత్ అను వర్తతే – తదేవ ప్రామాణికరోతి ఇతి అర్థం” అన్నారు.

లౌకిక వైదిక విషయాలలో సామాన్యులు ఎక్కువ మంది ఏది చేస్తే అదే ప్రమాణంగా స్వీకరింపబడుతున్నది అన్నారు.

“యత్ వాక్యాధికం  ప్రామాణీ కురుతే యదుక్త ప్రకారేణ తిష్యంతి ఇతి అర్థతః” అని అన్నారు.

పై వివరణలలో “యత్ ప్రమాణం“ అన్నభాగం “యత్ “ — “ ప్రమాణం“ అని విడగొట్టబడింది. ఈ  ప్రయోగానికి స్వామి రామానుజులు తమ భాష్యంలో ఒక ప్రత్యేకమైన వివరణను చెప్పారు.

“యత్ ప్రమాణం“ అన్న ప్రయోగాన్ని బహువ్రీహి సమసంగా గ్రహించి వివరించారు. దీనికంటే ముందు ఈ శ్లోకానికి వీరు చేసిన వ్యాఖ్యానాన్ని ఒక సారి చూడవలసి వుంది.

శ్రేష్టః – క్రుస్న శాస్త్ర జ్ఞాత్రుతయా అనుష్టాత్రుతయా చ ప్రతితః

పెద్దలనగా శాస్త్రములను బాగా చదివి, దాని ప్రకారం ఆచరిచేవారు.

‘ యద్యదాచరతి తత్త దేవ అక్రుస్న జనా అపి ఆచరతి‘

 శాస్త్ర జ్ఞానము అంతగాలేని సామాన్యులు పెద్దల ఆచరణను చూసి అనుసరిస్తారు.

“అనుష్టీయమానం అపి కర్మ శ్రేష్టో, యత్ ప్రమాణం యత్ – అంగయుక్తం అనుతిష్టతి  తత్  అంగయుక్తం ఏవ అక్రుత్స్నవిల్లోకోను తిష్టతి.“

ఈ ప్రకారం చేయబడే కర్మలలో సామాన్యులు, పెద్దలు చేసేకర్మలనే అనురిస్తున్నారు.

యత్ ప్రమాణం అన్న ప్రయోగం చక్కగా వివిరింపబడింది. ఇక్కడ రామానుజులవారు ఇచ్చిన వివరణ చక్కగా సరిపోవటమే కాక చాలా చక్కగా అమరింది. సామాన్యులు కర్మలను ఆచరించే విధానాన్ని వివరించే ప్రకరణంలో  కర్మ, కర్మఫలములను మాత్రమే వివరిస్తే సరిపోతుంది. పెద్దలు ఆచరించినదానినే సామాన్యులు ఆచరిస్తారు అని చూపటం చాలా చక్కగా అమరింది. ఎందుకంటే సరియిన ప్రమాణాన్నే అనుసరించాలన్న విషయము భగవగ్దీతలో ౩వ అధ్యాయంలో ప్రస్ఫుటంగా చెప్పలేదు. అర్జునుడికి ఏ ప్రమాణము తగినది అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. కర్మను గురించిన చర్చ మాత్రమే జరిగింది. అందువలన సామాన్యుల ఆచరణకు సంబంధించిన ప్రమాణాన్ని గురించి చెప్పలేదు.

                స్వామిరామానుజులు ఈ అర్థాన్ని తిరుప్పావై నుండి గ్రహించి మనకు అనుగ్రహించారన్న విషయం గుర్తించ వలసిన విషయము.  తిరుప్పావైలోని 26వ పాశురములో ఆండాళ్,  “మేలైయార్ సేయ్వనగళ్ వేండువన కెట్టియేల్“  అన్నది. ‘వేండువన ‘  అన్న ప్రయోగమే ఇక్కడ ‘యత్ ప్రమాణం‘ అన్న ప్రయోగాన్ని వివరిచేదిగా అమరింది.

                సమస్త విషయాలకు ప్రమాణంగా స్వీకరించే వేదము పలు నియమనిబంధనలను చెప్తుంది. ఇంకా, పెద్దలు వేదములో చెప్పబడ్డ అన్నింటిని పెద్దలు ఆచరించటము లేదు. వేటిని ఆచరించక పొతే పాపమో వాటిని మాత్రమే ఆచరిస్తున్నారు.

“క్రియమాణమ్ న కస్మైచిత్ యత్ అర్దాయ ప్రకల్పతే

అక్రియావదనర్దాయ తతు కర్మ సమాచరేత్“

ఫలమును ఆశించి చేసేకర్మలను వాళ్ళు చేయటం లేదు. చేయకుండా వదిలి వేస్తె పాపం అన్న విదిత కర్మలను మాత్రమే వాళ్ళు చేస్తున్నారు.

 ఒక సన్యాసి ఆశ్వమేధం చేయడానికి సంకల్పించరు కదా!

పెద్దలు ఆచరించే కర్మలు అవి లౌకికమో వైదికమో ఏదైనా సామాన్యులు  ఆచరించతగినవిగా తిరుప్పావైలోను  భగవగ్దీతలోను చెప్పబడ్డాయి. అందువలన శీలవంతులైన, వేద విదులైన పెద్దల ఆచరణయే సామాన్యులకు శిరోదార్యము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/2018/02/12/dramidopanishat-prabhava-sarvasvam-14-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

Leave a Comment