విరోధి పరిహారాలు – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/08/29/virodhi-pariharangal-36-telugu/

71.  సిద్ధాంత విరోధి  – సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే అవరోధాలు  – భాగం 1

పెరియ పెరుమాళ్ – ప్రథమాచార్య
నమ్మాళ్వార్ – ఎమ్పెరుమానార్ – పిళ్ళై లోకాచార్యులు – మాముణులు

సిద్ధాంతం అంటే స్థాపించబడిన ఉపదేశాలు అని అర్థం. ఏదైనా ఒక విషయంపైన, తప్పు అవగాహనలను తిరస్కరించి సరైన అవగాహనను ఏర్పరచడాన్ని సిద్ధాంతం అంటారు. ఏ సిద్ధాంతం అయినా, అది తప్పని సరిగా వేదానికి అనుగుణంగా ఉండాలి, శాస్త్ర ప్రమాణాలు ఉండాలి, పండితుల వివరణలు ఉండాలి. ఒక సిద్ధాంతాన్ని స్థాపించబడడానికి శాస్త్రంలోని రుజువులను ప్రమాణాలు అంటారు. వేదం శాశ్వతమైనదని, మచ్చలేని ప్రమాణంగా ఆస్తికులు (వేదాన్ని అత్యున్నత ప్రాధికరణము అని అంగీకరించిన పండితులు) అందరు అంగీకరించారు. వ్యాస భగవానుడి దివ్య పలుకులు ఇలా ఉన్నాయి –  “వేదాత్ శాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం” – (వేదానికి  మించిన గ్రంథము లేదు, కేశవునికి సమానమైన దేవుడు లేడు). పరం అన్న పదం ఆధిపత్యాన్ని (దానికి సమానమైన/ మించినది లేనిది) సూచిస్తుంది . నమ్మాళ్వారుల తిరువాయ్మొళి యొక్క మొదటి తనియన్లో “ద్రావిడ వేద సాగరం” (ద్రావిడ వేద సముద్రం) అని  వివరిస్తున్నారు. ఆళ్వారులందించిన దివ్య ప్రబంధం వేదంతో సమానంగా పరిగణించబడింది. ఈ  సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రమిది, “నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః….యచ్చ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే స్రూయతేపిచ, అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప నారాయణస్స్తితః” – నారాయణుడే మహోన్నత బ్రహ్మ, వారే సర్వశ్రేష్ట సూత్రం…ఈ విశ్వములో కనిపించేది/వినిపించేది ఏదైనా అన్నింటి లోపల బయట నారాయణుడే వ్యక్తమవుతున్నాడు.  దీని అంతరార్థం ఏమిటంటే వారే ప్రతి వస్తువులో నివసించే ఆత్మగా (అంతర్యామిగా) ఉన్నాడు. అతను అన్నింటిలో అంతర్యామిగా ఉండటం ద్వారా వారందరినీ భరిస్తాడు. ఈ పరిచయంతో, ఇప్పుడు ఈ విభాగంలో ముందుకు వెళదాము. అనువాదకుల గమనిక: మన సిద్ధాంతానికి విశిష్టాద్వైత సిద్ధాంతం అని పేరు పెట్టారు – సంపూర్ణ వైధిక సిద్ధాంతమిది (వేదం, వేదాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉన్న సిద్ధాంతం). అనాది నుండి ఉన్న ఈ సిద్ధాంతం శాశ్వతమైనది. పరాశర, వ్యాస, బోదాయన, టంక, ద్రమిడ వంటి ఋషులు మొట్ట మొదట ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. తరువాత, ఆళ్వారులు అవతరించి వైధిక సారాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ద్రవిడ వేదాన్ని ప్రచారం చేశారు. శ్రీ రామానుజులు  బ్రహ్మ సూత్రం మరియు భగవద్గీతకు వివరణాత్మక వ్యాఖ్యానాలు రాశారు. ఉపనిషత్తుల ప్రధాన సూత్రాలను వారు తమ ఇతర రచనలలో వివరించారు. శ్రీ రామానుజుల రచనలను లోతుగా వివరించిన ప్రధాన ఆచార్యలలో ఒకరు శృత ప్రకాశికాచార్యులు. ఆళ్వారుల పాసురములను అనేక వ్యాఖ్యానాల ద్వారా  వివరించారు. ఆళ్వారుల దివ్య పాసురముల యొక్క కొన్ని సంక్లిష్టమైన అర్థాలను వెలికి తెచ్చిన ప్రధాన ఆచార్యులలో నంపిళ్ళై ఒకరు. వారి  శిష్యులైన పెరియవాచాన్ పిళ్ళై మరియు వడక్కు తిరువీధి పిళ్ళై, నమ్మాళ్వారి తిరువాయ్మొళి  యొక్క దివ్య పాసురార్ధాలను వెలికి తీసే ప్రయత్నంలో అతనికి పూర్తి సహాయం చేశారు. పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తిరువాయ్మొళి యొక్క సారాన్ని అందంగా వెలికి తెచ్చి అనేక అద్భుతమైన రహస్య గ్రంథాలుగా (రహస్య సాహిత్యం) నమోదు చేశారు. మణవాళ మాముణులు ఈ రహస్య గ్రంథాలకు అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు. దివ్య ప్రబంధం, వేదాంతం మరియు రహస్య గ్రంథాల మధ్య సంబంధాన్ని వారు ఎన్నో ఉపన్యాసాలలో అద్భుతంగా వివరించారు. ఈ విధంగా, చరిత్రలో అనేక తరాల నుండి ఈ సిద్ధాంతం ఎందరో గొప్ప పండితులచే పోషింపబడుతూ వస్తుంది. ఈ సిద్ధాంత ప్రధాన సూత్రం ఏమిటంటే, 3 తత్వాలు ఉన్నాయి – చిత్ (అసంఖ్యాక జీవాత్మలు), అచిత్ (అసంఖ్యాక జీవంలేని పదార్థాలు) మరియు ఈశ్వరుడు. ఇక్కడ, ఈశ్వరుడు (సర్వశ్రేష్ఠ భగవానుడు) మరియు చిత్ (చేతనము గలవి) / అచిత్ (చేతనము లేనివి) – మధ్య రెండు ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి. మొదటిది శరీర / శరీరి భావం – అనగా, భగవానుడు చేతనాచెతనములలో అంతరాత్మ (శరీరి – శరీరం ఉన్నది)  రూపంలో నివాసుడై ఉన్నాడు, మరలా అవి (చిత్ అచిత్తులు) భగవాన్ యొక్క శరీరాలు. రెండవది విశేషణ / విశేష్య భావం – అనగా, భగవానుడు అనే వాడు ఒక్కడు (విశేష్య – విషయం), చిత్ అచిత్తులను తమ గుణాలు (విశేషణ) గా  కలిగి ఉన్నవాడు. కాబట్టి, కలిపి చూస్తే, చిత్ / అచిత్తులతో కలిసి ఉన్న భగవానుడు ఒక విలక్షణమైన అస్తిత్వమని చెప్పబడింది, అతనికి సమానమైన ఇంకొక రెండవ అస్తిత్వం ఉండదు. అలాగే, శాస్త్రం నుండి వివిధ ప్రమాణాల ద్వారా శ్రీమన్నారాయణుడు అత్యున్నతుడని స్థాపించబడింది. ఈ విభాగంలో, ఎన్నో లోతైన సూత్రాలు వెల్లడి చేయబడ్డాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా వరకు వేదం, వేదాంతం మొదలైన వాటి యొక్క కొన్ని ప్రాథమిక సూత్రాల ముందస్తు జ్ఞానం అవసరం. అతివిస్తారమైన విభాగం ఇది. ఇప్పుడు మనం విభాగంలోకి వెళ్లి ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.

  • వైధిక సిద్ధాంతానికి (వేదం/ వేదాంత సిద్ధాంతాలు) విరుద్ధమైన ప్రమాణాలను స్వీకరించడం ఒక అడ్డంకి. వేద ప్రమాణాలకు  విరుద్ధంగా వివరించబడిన సూత్రాలు, అవి ఎవరు వివరించినా సరే, అటువంటి విరుద్ధమైన సూత్రాలకు స్వీకరణ చూపకూడదు. అనువాదకుల గమనిక: ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన విషయం ఒకటుంది. శాస్త్రం మరియు శాస్త్ర తాత్పర్యాలు (సారాంశాలు) ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన పూర్వాచార్యుల వంటి ఉన్నత జ్ఞానులు శాస్త్రం మరియు శాస్త్ర తాత్పర్యాలు రెండింటిపై లోతైన అవగాహనతో సూత్రాలను వాక్చాతుర్యంతో వివరించారు. ఉదాహరణకు, మన శాస్త్రంలో వర్ణాశ్రమ ధర్మానికి  ప్రాధాన్యమివ్వడం జరిగింది. కానీ భగవత్ కైంకర్యం మరియు భాగవత ధర్మం (భాగవతులతో వ్యవహరించడం) గురించి కూడా శాస్త్రంలో వివరించబడింది. మన పూర్వాచార్యులు శాస్త్రాన్ని క్షున్నంగా అర్థం చేసుకొని వర్ణాశ్రమ ధర్మం మరియు భగవత్ కైంకర్యం / భాగవత ధర్మం రెండింటి గురించి చక్కని సమతుల్యతతో వివరించారు. వారు రెండింటి యొక్క ప్రాముఖ్యతను కీర్తించారు, అయినప్పటికీ భగవత్ / భాగవత కైంకర్యం వర్ణాశ్రమ ధర్మానికంటే అధిక ప్రధాన్యమైనదని స్థాపించారు.  సిద్ధాంతాన్ని స్పష్టంగా స్థాపించే మన పూర్వాచార్యుల మేధస్సును అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ.
  • ప్రత్యక్ష్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వేదంలో వివరించినవి స్వయం స్పష్టమైనవని అర్థంచేసుకొనక పోవడం ఒక అడ్డంకి. సాధారణంగా ప్రమాణం అంటే రుజువు. మన పూర్వాచార్యులు 3 ప్రమాణములను వివరించారు –  ప్రత్యక్ష్యం (ఇంద్రియాల ద్వారా ప్రత్యక్ష అవగాహన – దృష్టి, స్పర్శ, ధ్వని, వాసన మరియు రుచి), అనుమానం (పూర్వ జ్ఞానం ఆధారంగా అనుమానాలు – ఉదాహరణకు, పొగను చూసినప్పుడు అగ్ని ఉందని మనము అర్థం చేసుకుంటాము – ఇది పొగ, అగ్ని (రెండిటిని) కలిపి చుసిన మన గత జ్ఞానంపై ఆధారితమైనది, శబ్దం (వేదం, వేదసూత్రాలను వివరించే సహాయక సాహిత్యం). వీటిలో, వేదాన్ని స్వతః ప్రమాణం అని వివరించబడింది – స్వయం ప్రత్యక్షమైనది (స్వయం ప్రమాణం) – ఏ ప్రశ్నకు అవకాశం లేకుండా, సూత్రాలు వాటికవే వివరణలు. ఇవి “ప్రశ్నించలేని ప్రమాణాలు” గా వివరించబడ్డాయి. ఆస్తికుడంటే భగవంతుడు ఉన్నాడని స్వీకరించినట్లే, వేదం యొక్క ఆధిపత్యాన్ని కూడా స్వీకరించేవాడు. అనువాదకుల గమనిక: వేదం/ శాస్త్రం ఉన్నది ప్రధానంగా జీవాత్మల కోసం. ఇంతకు ముందు వివరించిన మూడు తత్వాలలో, భగవాన్ సర్వజ్ఞుడు (అన్నీ తెలిసినవాడు) అందువల్ల వేదం వారికి అవసరం లేనిది. అచిత్తులకు (అచేతన పదార్థాలు) జ్ఞానం ఉండదు కాబట్టి వేదం వాటికి ఎటువంటి ఉపయోగం లేనిది. కానీ జీవాత్మలకు, వేదం అనేది వారి జీవితాలను సరిదిద్దుకోడానికి, ఆధ్యాత్మికంగా పైకి ఎదగి చివరికి మోక్షాన్ని పొందడానికి మార్గ దర్శకం. ఒక తల్లి తన బిడ్డపై ఉన్న ప్రేమకంటే  1000 రెట్లు ఎక్కువ వేదానికి / శాస్త్రానికి  జీవాత్మలపై శ్రద్ధ  ఉందని వివరించబడింది. వేదం ఖచ్చితంగా జీవాత్మల శ్రేయస్సుకి, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది అని వివరించబడినది . కాబట్టి, మన ప్రత్యక్ష అవగాహనకు విరుద్ధంగా అనిపించే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ, మనం వేదాన్ని అంగీకరించాలి, దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉండి భగవానుడిపై దృష్ఠిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఆహారనియంత్రణ (ఉపవాసం ఉండటం చాలా మందికి కష్టకరమైనది) చేయమని శాస్త్రం నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఆశ్చర్యపోవచ్చు – కాని ఇక్కడ, ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి మనం ఎదిగేలా శాస్త్రం సహాయపడుతుందని మనం అర్థం చేసుకున్నట్లైతే,  శాస్త్ర సూత్రాలను మనం పూర్తిగా అంగీకరిస్తాము. వాటిని అనుసరించే ప్రయత్నం కూడా చేస్తాము.
  • వేద వేదాంతార్ధాలను విస్తృతంగా వివరిస్తున్న స్మృతి, ఇతిహాసం, పురాణములు మొదలైన వాటిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండకపోవడం ఒక అడ్డంకి. వేద ఉప బృహ్మణం – ఇవి వేద సూత్రాలను అర్థం  చేసుకోవడానికి మనకు సహాయపడే సహాయక సాహిత్యాలు. వీటిలో స్మృతి, ఇతిహాసం, పురాణాలు మొదలైనవి ఉన్నాయి. స్మృతి అంటే వేద సూత్రాలను దృష్టిలో ఉంచుకుని రాసిన సాహిత్య సంకలనం. ఇతిహాసములు- మహాకావ్యములు- చారిత్రిక పత్రాలు – శ్రీ రామాయణం మరియు మహాభారతం. పురాణాలలో శ్రీ విష్ణుపురాణం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ దృఢమైన ప్రమాణములు (ఆధారములు) అని ఒక బలమైన నమ్మకం మనకుండాలి. భగవాన్ స్వయంగా “సృతిస్ స్మృతిర్ మామైవాజ్ఞా, ఆజ్ఞాచ్చేతీ మమ ద్రోహి, మద్ భక్తోపి  వైష్ణవః” – శృతి స్మృతులు స్వయంగా నా ఆదేశాలు, వాటిని అనుసరించని వారు ద్రోహులు. అతను నా భక్తుడైనా సరే వైష్ణవుడిగా పరిగణించబడడు. శృతి (వేదం), స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవన్నింటిని సమిష్టిగా శాస్త్రం అంటారు. శ్రీ కృష్ణ పరమాత్మ  భగవద్గీత 16.24 లో ఇలా ఉపదేశించారు, “తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే” – అందువల్ల శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి / ప్రమాణంగా స్వీకరించాలి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్నిఇలా ప్రారంభిస్తున్నారు,  “వేదార్థం అఱుధియిడువదు స్మృతి ఇతిహాస పురణంగలలే” – స్మృతి, ఇతిహాసాలు, పురాణాలలో వేదార్థాలు దృఢంగా వివరించబడ్డాయి. మాముణులు ప్రారంభించడానికి ఉత్తమ వివరణ ఇస్తున్నారు. ప్రమాతా (ఆచార్య – పూర్వాచార్యులు) ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని (లక్ష్యం)  స్థాపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వేదం అంతిమ ప్రమాణమని అద్భుతంగా స్థాపించారు. కాబట్టి, మొదట అత్యున్నత ప్రమాణమేదో తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన సహాయక సాహిత్యాలను సరైన గురువుల నుండి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తరువాత, మాముణులు జాబితా చేయబడిన అనేక విభిన్న సహాయక సాహిత్యాలు ఉన్నాయని,  వేదార్ధాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడటానికి అవి ఎలా విలువైనవో ఇక్కడ వివరిస్తున్నారు. దీన్ని సరిగ్గా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి, మనకు ప్రాథమిక సూత్రాల గురించి గొప్ప అవగాహన ఇస్తుంది.
  •  వివిధ సహాయక సాహిత్యాలలో, సాత్వికుల (మంచితనం / ధర్మ రీతిని పాఠించేవారు) చేత అంగీకరించబడిన సాత్విక అంశాలు, వాటిని వెల్లడి చేసే భాగాలు ప్రధాన ప్రమాణములు అని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఉప బృహ్మణం లో (సహాయక సాహిత్యం), ముఖ్యంగా పురణాలు, సాత్విక అంశాలు ప్రధాన ప్రమాణాలు. రాజస మరియు తామస అంశ విభాగాలు కూడా ఉన్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. అనువాదకుల గమనిక: మత్స్య పురాణంలో, “యస్మిన్ కల్పేతు యత్ ప్రోక్తం పురాణం బ్రహ్మణా పురా, తస్య తస్యతు మాహాత్మియం తత్ స్వరూపేణ వర్ణ్యతే” – సత్వ, రాజస లేదా తామస స్వభావం కలిగిన దేవతలను కీర్తిస్తూ, ఒక కాలంలో ఒక గుణం (సత్వ, రాజస లేదా తామస గుణం) ప్రధానంగా ఉన్నపుడు బ్రహ్మ పురాణాలను వెల్లడి చేసారు. ఈ స్లోకాన్ని పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క 3వ సూత్ర వ్యాఖ్యానంలో మాముణుల చేత కీర్తించబడింది. పురాణాలను సాత్విక కోణంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం గమనించాలి.  మన పూర్వాచార్యులు (శుద్ద సాత్వికులు) పురాణాల యొక్క సాత్విక భాగాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. పురాణముల యొక్క సాత్విక భాగాలు, శ్రీమన్నారాయణ మరియు వారి కీర్తిని వెల్లడిచేస్తాయి. దీనిపై వైష్ణవుల యొక్క ప్రధాన దృష్టి ఉంటుంది.
  • రాజస / తామస  వ్యక్తిత్వాలకు సంబంధించిన సాత్విక అంశాలు సాత్వికులకు అనుపధేయం (హితమైనవి కావు) అని తెలియకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మా, శివ, లింగం మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించిన పురాణాలలో, రాజస / తామస వ్యక్తిత్వం ఉన్నందున వాటికి సంబంధించిన సాత్విక భాగాలను స్వీకరించాలి. ఇక్కడ మూల గ్రంథములో దీనిని అనుపధేయం (హితమైనవి కావు) అని అంటారు – కాని ఇది అక్షర దోషం కావచ్చు. అది ఉపాధేయం (ఆమోదయోగ్యమైనది) అయి ఉండాలి. తిరువాయ్మొళి 6.10.8 లో నమ్మాళ్వార్ శివుని యొక్క సాత్విక గుణాన్ని ఇక్కడ మనకందిస్తున్నారు, “నుణ్ణుణర్విన్ నీలార్ కణ్డత్తమ్మానుం” – మహా జ్ఞాని అయిన శివుడు విషాన్ని మింగి ఈ విశ్వాన్ని రక్షించాడు, అందుకని వారి కంఠం నీలంగా ఉంటుంది అని కీర్తించారు. సత్వ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు తిరుమల వేంకటేశ్వరుని ఆరాధించడానికి వచ్చినందున ఇక్కడ ఆళ్వార్ శివుడిని కీర్తిస్తున్నారు. అలాగే, ప్రఖ్యాత ప్రమాణ  స్లోకమైన – “వైకుణ్టేతు పరే లోకే… ఆస్తే విష్ణురచింత్యాత్మా” లింగ పురణంలో కనిపిస్తుంది – ఈ స్లోకము ప్రతిరోజూ మంత్ర పుష్పం సమర్పిస్తూ తిరువారాధన సమయంలో శ్రీవైష్ణవులు పఠిస్తారు.
  • అరుళి చెయల్ (దివ్య ప్రబంధం) సాత్విక, రాజస, తామసం మొదలైన విభజన లేకుండా ఇది మచ్చలేనిదని దృఢ నమ్మకం ఉండకపోవడం ఒక అడ్డంకి. ఎందుకంటే ఇది శుద్ద సాత్వికులైన మన పూర్వాచార్యులు సంపూర్ణంగా స్వీకరించినది. అతి శుద్ధమైన భక్తి జ్ఞానంతో శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడిన ఆళ్వారుల దివ్య ప్రబంధములు కూడా శుద్ధమైనవి. వీటిని పవిత్రమైన మన పుర్వాచార్యులు స్వీకరించి అనుసరించారు. కాబట్టి, వాటిలో ఎటువంటి లోపానికి అవకాశం లేదు. ఈ సూత్రంపై బలమైన నమ్మకం శ్రీవైష్ణవులకు ఉండటం చాలా అవసరం.
  • పూర్వాచార్యుల దివ్య పలుకులు సాత్వికులకు అత్యంత ప్రామాణికమైనవని పూర్తిగా నమ్మకపోవడం ఒక అడ్డంకి. ఆళ్వారులు శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడినట్టుగా, మన పుర్వచార్యులు ఆళ్వారులచే అనుగ్రహింపబడ్డారు. వారి ఉపదేశాలను సంపూర్ణంగా స్వీకరించి కీర్తించాలి. అనువాదకుల గమనిక: ధర్మశాస్త్రంలో, “ధర్మజ్ఞ సమయం ప్రమానం వేదశ్చ” – గొప్ప వ్యక్తుల ఆలోచనలు / అభిప్రాయాలు ప్రామాణికమైనవి, వేదం కూడా ఒక ప్రమాణం. ఇక్కడ ధర్మజ్ఞ అంటే “ధర్మం తెలిసినవాడు” అని అర్ధం – మనకు భగవానుడు సిద్ద ధర్మం (ప్రామాణికమైన ధర్మసూత్రాలు), అందువల్ల ధర్మజ్ఞ  అనగా భగవాన్ యొక్క స్వభావాలు, నామాలు, రూపాలు, గుణాలు మొదలైన వాటి గురించి పూర్తి అవగాహన ఉన్న ఆళ్వారులు మరియు ఆచార్యులను సూచిస్తుంది.  కాబట్టి, మన పూర్వాచార్యుల సూక్తులపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. మణవాళ మాముణులు  ఉపదేశ రత్నమాలలో 36 “తెరుళుత్త ఆళ్వార్గళ్ చీర్మై  అఱివారార్, అరుళిచ్ చెయలై అఱివారార్, అరుళ్ పెత్త నాదముని ముదలాన నాం దేసికరై అల్లాల్ పేడై మనమే! ఉణ్డో పేచు” – జ్ఞానులైన ఆళ్వారుల నిజమైన కీర్తి ఎవరికి తెలుసు? దివ్య ప్రబంధాల యొక్క దివ్య అర్థాలు ఎవరికి తెలుసు? ఓ ప్రియమైన హృదయమా! ఆళ్వారులచే అనుగ్రహింపబడిన మన పూర్వాచార్యుల (నాథమునులతో ప్రారంభించి) లాంటి వారు ఎవరైనా ఉన్నారా? మన పూర్వాచార్యులకు సంబంధించి అనేక సంఘటనలు అనేక గ్రంథములలో నమోదు చేయబడ్డాయి. మన శ్రేయస్సు కోసం హృదయపూర్వక భక్తితో వాటిని మనం నిరంతరం అధ్యయనం చేయాలి, వినాలి, వాటిని గురించి చింతన చేయాలి, అనుసరించడానికి ప్రయత్నించాలి.
  • స్వయంగా శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన శ్రీ పాంచరాత్రంపై సంపూర్ణ విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన శ్రీ పాంచరాత్ర సంహితుల ప్రామాణికతపై సంకోచం కూడా ఉండకూడదు, దీనిని “భగవత్ శాస్త్రం” అని పిలుస్తారు. వేదానికి సమానంగా పరిగణించాలి. పరమాచార్య ఆళవందారులు మనకు “ఆగమ ప్రామాణ్యం” (ఆగమం – శ్రీ పాంచరాత్ర ఆగమం) అనే దివ్య గ్రంథమును ఆశీర్వదించారు, ఇది శ్రీ పాంచరాత్ర ఆగమం యొక్క ప్రామాణికతను వివరంగా తెలియజేస్తుంది.
  • అన్ని ప్రమాణములు భగవత్ స్వరూపంపై కేంద్రీకృతమై ఉన్నాయని నమ్మకం లేకపోవడం ఒక అడ్డంకి. భగవద్గీత 15.15 లో, కృష్ణ పరమాత్మ “వేదైశ్చ సర్వైర్ అహమేవ వేధ్యః” – వేదం నా గురించి మాత్రమే చెబుతుంది. వేదం యొక్క ఉద్దేశ్యం భగవానుడిని కీర్తించడమే. పెరియాళ్వార్  తిరుమొళి 2.9.6లో పెరియాళ్వారులు ఇలా వెల్లడి చేస్తున్నారు “వేదప్పొరుళే ఎన్ వేంకటవా” – వేదం యొక్క మూల బిందువైన ఓ వేంకట. ఇక్కడ భగవాన్ తన రూప, గుణ, ఐశ్వర్యం, స్వరూపం, నామాలు మొదలైనవాటితో సహా ఉన్నవాడు. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమానార్ తమ భాష్యం (వ్యాఖ్యానం) లో గీతా శ్లోకం 15.15 నికి సమతుల్యంగా ఉన్న మనుస్మృతి 12.9న్ని వివరించారు, “సరీరజైః కర్మ ధోషైః యాతి స్తావరతాం నరః, వచికైః పక్షి మృగతాం మానసైర్ అంత్యజాతితాం” – ఒక మనిషి తన చేతులతో ఇతరులను శారీరకంగా బాధ పెట్టినప్పుడు, అతను ఒక చెట్టులా పుడతాడు; అతను తన మాటలతో బాధ పెట్టినప్పుడు, అతను పక్షి / జంతువుగా పుడతాడు, అతను తన మనస్సు ద్వారా ఇతరులను బాధ పెట్టినప్పుడు, అతను అతి అల్ప వ్యక్తిగా జన్మిస్తాడు. ఇక్కడ వివిధ రకాలైన శరీరాలను (మానవుడు, చెట్టు, జంతువు మొదలైనవి) గురించి వివరిస్తున్నప్పటికీ, చివరికి అది జీవాత్మ యొక్క కర్మానుసారంగా వచ్చే జన్మ  గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా వేదం అగ్ని, వాయు, వంటి ఇతర దేవతల గురించి మాట్లాడినప్పుడల్లా, చివరికి అన్నింటిలో అంతరాత్మగా ఉన్న శ్రీమన్నారాయణుడను మాత్రమే సూచిస్తుంది. పెరియాళ్వార్ తిరుమొళి పాసుర వ్యాఖ్యానానికి, మాముణులు ఈ గీతా శ్లోకాన్ని ఉల్లేకిస్తూ ఈ పాసురాన్ని,  “తిరుమల వేంకటేశ్వరుని రూపంలో వేదం యొక్క మూల బిందువు నా ముందు ఉంది” వారు అందంగా వివరించారు.
  • చిత్ మరియు అచిత్తులతో కూడి ఉన్న పరమాత్మనే అన్ని వాక్కుల పరమార్థం అని మనం అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మ  శ్రీ రామాయణంలో శ్రీ రాముని ఇలా కీర్తించారు, “భవాన్ నారాయణో దేవః జగత్ సర్వం శరీరం తే” – నీవే నారాయణుడవి, సర్వోన్నత దేవుడివి. ఈ విశ్వమంతా నీ శరీరం. ఏది చూసినా, విన్నా, అవన్నీ పరబ్రహ్మ శ్రీమన్నారాయణ శరీరమే. ఆయన ప్రత్యక్షంగా జీవాత్మలలో వ్యక్తమవుతాడు, జీవాత్మ ద్వారా అచిత్లో వ్యక్తమవుతాడు. నామం రూపం ఉన్నదేదైనా అందులో  భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని వివరించబడింది. అనువాదకుల గమనిక: వేదార్థ సంగ్రహంలో, వేదాంతం నేర్చుకున్నవాడు ప్రతిదానిలోనూ భగవాన్ని చూస్తాడు అని శ్రీ రామానుజులు వివరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మేకను చూసినప్పుడు, వారు ఆ మేకలో ఉన్న జీవాత్మను చూస్తాడు, ఆ జీవాత్మ లోపల ఉన్న పరమాత్మను చూస్తాడు. కానీ వేదాంతం నేర్చుకోని వాడు, మేకను మాత్రమే చూస్తాడు, ఎందుకంటే అతను  తత్వ త్రయ సిద్ధాంతం – చిత్, అచిత్ మరియు ఈశ్వరుని గురించి తెలియని వాడు కాబట్టి.
  • భగవానుడు  ప్రతి ఒక్కరిలో నివసించే ఆత్మ అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మునుపటి వివరణ మాదిరిగానే. అనువాదకుల గమనిక: నారాయణ సూక్తంలో “అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ  స్తితః” – అంతటా శ్రీమన్నారాయణ వ్యాపించి ఉన్నాడు. ఇదే సూత్రాన్ని నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 1.1.10 లో “పరంద తాణ్ పరవైయుళ్ ణీర్ తొఱుం పరందుళన్ పరంద అణ్డం ఇదెన నిల విశుంబు ఒళివఱ కరంద సిల్ ఇడం తొఱుం ఇడం తిగళ్ పొరుళ్ తొఱుం కరందు ఎంగుం పరందుళన్ ఇవై ఉణ్డ కరనే” – భగవాన్ సముద్రములో ఉన్న చిన్న నీటి బిందువులో ఉన్నట్టే విరాటస్వరూపంగా ఈ విశ్వంలో కూడా అంతే సులభంగా వ్యాపించి ఉన్నాడు. అదేవిధంగా, అతను ఈ భూమిపైన, పై గ్రహాలు మొదలైన వాటిలో కూడా నివసించి ఉన్నాడు, జీవాత్మలు నివసించే అతి సూక్ష్మ ప్రదేశాలలో కూడా ఉన్నాడు. జీవాత్మలు అతని ఉనికిని గ్రహించక పోయినా భగవాన్ అక్కడ ఉంటాడు. అటువంటి సర్వవ్యాపి అయిన భగవానుడు సంహారం (ప్రళయ) సమయంలో అన్నింటినీ తనలోకి తీసుకుంటాడు, తన లోపల ఉంచుకొని రక్షిస్తాడు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/09/virodhi-pariharangal-37/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment

విరోధి పరిహారాలు – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/08/29/virodhi-pariharangal-36-telugu/

71.  సిద్ధాంత విరోధి  – సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే అవరోధాలు  – భాగం 1

పెరియ పెరుమాళ్ – ప్రథమాచార్య
నమ్మాళ్వార్ – ఎమ్పెరుమానార్ – పిళ్ళై లోకాచార్యులు – మాముణులు

సిద్ధాంతం అంటే స్థాపించబడిన ఉపదేశాలు అని అర్థం. ఏదైనా ఒక విషయంపైన, తప్పు అవగాహనలను తిరస్కరించి సరైన అవగాహనను ఏర్పరచడాన్ని సిద్ధాంతం అంటారు. ఏ సిద్ధాంతం అయినా, అది తప్పని సరిగా వేదానికి అనుగుణంగా ఉండాలి, శాస్త్ర ప్రమాణాలు ఉండాలి, పండితుల వివరణలు ఉండాలి. ఒక సిద్ధాంతాన్ని స్థాపించబడడానికి శాస్త్రంలోని రుజువులను ప్రమాణాలు అంటారు. వేదం శాశ్వతమైనదని, మచ్చలేని ప్రమాణంగా ఆస్తికులు (వేదాన్ని అత్యున్నత ప్రాధికరణము అని అంగీకరించిన పండితులు) అందరు అంగీకరించారు. వ్యాస భగవానుడి దివ్య పలుకులు ఇలా ఉన్నాయి –  “వేదాత్ శాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం” – (వేదానికి  మించిన గ్రంథము లేదు, కేశవునికి సమానమైన దేవుడు లేడు). పరం అన్న పదం ఆధిపత్యాన్ని (దానికి సమానమైన/ మించినది లేనిది) సూచిస్తుంది . నమ్మాళ్వారుల తిరువాయ్మొళి యొక్క మొదటి తనియన్లో “ద్రావిడ వేద సాగరం” (ద్రావిడ వేద సముద్రం) అని  వివరిస్తున్నారు. ఆళ్వారులందించిన దివ్య ప్రబంధం వేదంతో సమానంగా పరిగణించబడింది. ఈ  సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రమిది, “నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః….యచ్చ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే స్రూయతేపిచ, అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప నారాయణస్స్తితః” – నారాయణుడే మహోన్నత బ్రహ్మ, వారే సర్వశ్రేష్ట సూత్రం…ఈ విశ్వములో కనిపించేది/వినిపించేది ఏదైనా అన్నింటి లోపల బయట నారాయణుడే వ్యక్తమవుతున్నాడు.  దీని అంతరార్థం ఏమిటంటే వారే ప్రతి వస్తువులో నివసించే ఆత్మగా (అంతర్యామిగా) ఉన్నాడు. అతను అన్నింటిలో అంతర్యామిగా ఉండటం ద్వారా వారందరినీ భరిస్తాడు. ఈ పరిచయంతో, ఇప్పుడు ఈ విభాగంలో ముందుకు వెళదాము. అనువాదకుల గమనిక: మన సిద్ధాంతానికి విశిష్టాద్వైత సిద్ధాంతం అని పేరు పెట్టారు – సంపూర్ణ వైధిక సిద్ధాంతమిది (వేదం, వేదాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉన్న సిద్ధాంతం). అనాది నుండి ఉన్న ఈ సిద్ధాంతం శాశ్వతమైనది. పరాశర, వ్యాస, బోదాయన, టంక, ద్రమిడ వంటి ఋషులు మొట్ట మొదట ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. తరువాత, ఆళ్వారులు అవతరించి వైధిక సారాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ద్రవిడ వేదాన్ని ప్రచారం చేశారు. శ్రీ రామానుజులు  బ్రహ్మ సూత్రం మరియు భగవద్గీతకు వివరణాత్మక వ్యాఖ్యానాలు రాశారు. ఉపనిషత్తుల ప్రధాన సూత్రాలను వారు తమ ఇతర రచనలలో వివరించారు. శ్రీ రామానుజుల రచనలను లోతుగా వివరించిన ప్రధాన ఆచార్యలలో ఒకరు శృత ప్రకాశికాచార్యులు. ఆళ్వారుల పాసురములను అనేక వ్యాఖ్యానాల ద్వారా  వివరించారు. ఆళ్వారుల దివ్య పాసురముల యొక్క కొన్ని సంక్లిష్టమైన అర్థాలను వెలికి తెచ్చిన ప్రధాన ఆచార్యులలో నంపిళ్ళై ఒకరు. వారి  శిష్యులైన పెరియవాచాన్ పిళ్ళై మరియు వడక్కు తిరువీధి పిళ్ళై, నమ్మాళ్వారి తిరువాయ్మొళి  యొక్క దివ్య పాసురార్ధాలను వెలికి తీసే ప్రయత్నంలో అతనికి పూర్తి సహాయం చేశారు. పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తిరువాయ్మొళి యొక్క సారాన్ని అందంగా వెలికి తెచ్చి అనేక అద్భుతమైన రహస్య గ్రంథాలుగా (రహస్య సాహిత్యం) నమోదు చేశారు. మణవాళ మాముణులు ఈ రహస్య గ్రంథాలకు అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు. దివ్య ప్రబంధం, వేదాంతం మరియు రహస్య గ్రంథాల మధ్య సంబంధాన్ని వారు ఎన్నో ఉపన్యాసాలలో అద్భుతంగా వివరించారు. ఈ విధంగా, చరిత్రలో అనేక తరాల నుండి ఈ సిద్ధాంతం ఎందరో గొప్ప పండితులచే పోషింపబడుతూ వస్తుంది. ఈ సిద్ధాంత ప్రధాన సూత్రం ఏమిటంటే, 3 తత్వాలు ఉన్నాయి – చిత్ (అసంఖ్యాక జీవాత్మలు), అచిత్ (అసంఖ్యాక జీవంలేని పదార్థాలు) మరియు ఈశ్వరుడు. ఇక్కడ, ఈశ్వరుడు (సర్వశ్రేష్ఠ భగవానుడు) మరియు చిత్ (చేతనము గలవి) / అచిత్ (చేతనము లేనివి) – మధ్య రెండు ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి. మొదటిది శరీర / శరీరి భావం – అనగా, భగవానుడు చేతనాచెతనములలో అంతరాత్మ (శరీరి – శరీరం ఉన్నది)  రూపంలో నివాసుడై ఉన్నాడు, మరలా అవి (చిత్ అచిత్తులు) భగవాన్ యొక్క శరీరాలు. రెండవది విశేషణ / విశేష్య భావం – అనగా, భగవానుడు అనే వాడు ఒక్కడు (విశేష్య – విషయం), చిత్ అచిత్తులను తమ గుణాలు (విశేషణ) గా  కలిగి ఉన్నవాడు. కాబట్టి, కలిపి చూస్తే, చిత్ / అచిత్తులతో కలిసి ఉన్న భగవానుడు ఒక విలక్షణమైన అస్తిత్వమని చెప్పబడింది, అతనికి సమానమైన ఇంకొక రెండవ అస్తిత్వం ఉండదు. అలాగే, శాస్త్రం నుండి వివిధ ప్రమాణాల ద్వారా శ్రీమన్నారాయణుడు అత్యున్నతుడని స్థాపించబడింది. ఈ విభాగంలో, ఎన్నో లోతైన సూత్రాలు వెల్లడి చేయబడ్డాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా వరకు వేదం, వేదాంతం మొదలైన వాటి యొక్క కొన్ని ప్రాథమిక సూత్రాల ముందస్తు జ్ఞానం అవసరం. అతివిస్తారమైన విభాగం ఇది. ఇప్పుడు మనం విభాగంలోకి వెళ్లి ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.

  • వైధిక సిద్ధాంతానికి (వేదం/ వేదాంత సిద్ధాంతాలు) విరుద్ధమైన ప్రమాణాలను స్వీకరించడం ఒక అడ్డంకి. వేద ప్రమాణాలకు  విరుద్ధంగా వివరించబడిన సూత్రాలు, అవి ఎవరు వివరించినా సరే, అటువంటి విరుద్ధమైన సూత్రాలకు స్వీకరణ చూపకూడదు. అనువాదకుల గమనిక: ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన విషయం ఒకటుంది. శాస్త్రం మరియు శాస్త్ర తాత్పర్యాలు (సారాంశాలు) ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన పూర్వాచార్యుల వంటి ఉన్నత జ్ఞానులు శాస్త్రం మరియు శాస్త్ర తాత్పర్యాలు రెండింటిపై లోతైన అవగాహనతో సూత్రాలను వాక్చాతుర్యంతో వివరించారు. ఉదాహరణకు, మన శాస్త్రంలో వర్ణాశ్రమ ధర్మానికి  ప్రాధాన్యమివ్వడం జరిగింది. కానీ భగవత్ కైంకర్యం మరియు భాగవత ధర్మం (భాగవతులతో వ్యవహరించడం) గురించి కూడా శాస్త్రంలో వివరించబడింది. మన పూర్వాచార్యులు శాస్త్రాన్ని క్షున్నంగా అర్థం చేసుకొని వర్ణాశ్రమ ధర్మం మరియు భగవత్ కైంకర్యం / భాగవత ధర్మం రెండింటి గురించి చక్కని సమతుల్యతతో వివరించారు. వారు రెండింటి యొక్క ప్రాముఖ్యతను కీర్తించారు, అయినప్పటికీ భగవత్ / భాగవత కైంకర్యం వర్ణాశ్రమ ధర్మానికంటే అధిక ప్రధాన్యమైనదని స్థాపించారు.  సిద్ధాంతాన్ని స్పష్టంగా స్థాపించే మన పూర్వాచార్యుల మేధస్సును అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ.
  • ప్రత్యక్ష్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వేదంలో వివరించినవి స్వయం స్పష్టమైనవని అర్థంచేసుకొనక పోవడం ఒక అడ్డంకి. సాధారణంగా ప్రమాణం అంటే రుజువు. మన పూర్వాచార్యులు 3 ప్రమాణములను వివరించారు –  ప్రత్యక్ష్యం (ఇంద్రియాల ద్వారా ప్రత్యక్ష అవగాహన – దృష్టి, స్పర్శ, ధ్వని, వాసన మరియు రుచి), అనుమానం (పూర్వ జ్ఞానం ఆధారంగా అనుమానాలు – ఉదాహరణకు, పొగను చూసినప్పుడు అగ్ని ఉందని మనము అర్థం చేసుకుంటాము – ఇది పొగ, అగ్ని (రెండిటిని) కలిపి చుసిన మన గత జ్ఞానంపై ఆధారితమైనది, శబ్దం (వేదం, వేదసూత్రాలను వివరించే సహాయక సాహిత్యం). వీటిలో, వేదాన్ని స్వతః ప్రమాణం అని వివరించబడింది – స్వయం ప్రత్యక్షమైనది (స్వయం ప్రమాణం) – ఏ ప్రశ్నకు అవకాశం లేకుండా, సూత్రాలు వాటికవే వివరణలు. ఇవి “ప్రశ్నించలేని ప్రమాణాలు” గా వివరించబడ్డాయి. ఆస్తికుడంటే భగవంతుడు ఉన్నాడని స్వీకరించినట్లే, వేదం యొక్క ఆధిపత్యాన్ని కూడా స్వీకరించేవాడు. అనువాదకుల గమనిక: వేదం/ శాస్త్రం ఉన్నది ప్రధానంగా జీవాత్మల కోసం. ఇంతకు ముందు వివరించిన మూడు తత్వాలలో, భగవాన్ సర్వజ్ఞుడు (అన్నీ తెలిసినవాడు) అందువల్ల వేదం వారికి అవసరం లేనిది. అచిత్తులకు (అచేతన పదార్థాలు) జ్ఞానం ఉండదు కాబట్టి వేదం వాటికి ఎటువంటి ఉపయోగం లేనిది. కానీ జీవాత్మలకు, వేదం అనేది వారి జీవితాలను సరిదిద్దుకోడానికి, ఆధ్యాత్మికంగా పైకి ఎదగి చివరికి మోక్షాన్ని పొందడానికి మార్గ దర్శకం. ఒక తల్లి తన బిడ్డపై ఉన్న ప్రేమకంటే  1000 రెట్లు ఎక్కువ వేదానికి / శాస్త్రానికి  జీవాత్మలపై శ్రద్ధ  ఉందని వివరించబడింది. వేదం ఖచ్చితంగా జీవాత్మల శ్రేయస్సుకి, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది అని వివరించబడినది . కాబట్టి, మన ప్రత్యక్ష అవగాహనకు విరుద్ధంగా అనిపించే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ, మనం వేదాన్ని అంగీకరించాలి, దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉండి భగవానుడిపై దృష్ఠిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఆహారనియంత్రణ (ఉపవాసం ఉండటం చాలా మందికి కష్టకరమైనది) చేయమని శాస్త్రం నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఆశ్చర్యపోవచ్చు – కాని ఇక్కడ, ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి మనం ఎదిగేలా శాస్త్రం సహాయపడుతుందని మనం అర్థం చేసుకున్నట్లైతే,  శాస్త్ర సూత్రాలను మనం పూర్తిగా అంగీకరిస్తాము. వాటిని అనుసరించే ప్రయత్నం కూడా చేస్తాము.
  • వేద వేదాంతార్ధాలను విస్తృతంగా వివరిస్తున్న స్మృతి, ఇతిహాసం, పురాణములు మొదలైన వాటిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండకపోవడం ఒక అడ్డంకి. వేద ఉప బృహ్మణం – ఇవి వేద సూత్రాలను అర్థం  చేసుకోవడానికి మనకు సహాయపడే సహాయక సాహిత్యాలు. వీటిలో స్మృతి, ఇతిహాసం, పురాణాలు మొదలైనవి ఉన్నాయి. స్మృతి అంటే వేద సూత్రాలను దృష్టిలో ఉంచుకుని రాసిన సాహిత్య సంకలనం. ఇతిహాసములు- మహాకావ్యములు- చారిత్రిక పత్రాలు – శ్రీ రామాయణం మరియు మహాభారతం. పురాణాలలో శ్రీ విష్ణుపురాణం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ దృఢమైన ప్రమాణములు (ఆధారములు) అని ఒక బలమైన నమ్మకం మనకుండాలి. భగవాన్ స్వయంగా “సృతిస్ స్మృతిర్ మామైవాజ్ఞా, ఆజ్ఞాచ్చేతీ మమ ద్రోహి, మద్ భక్తోపి  వైష్ణవః” – శృతి స్మృతులు స్వయంగా నా ఆదేశాలు, వాటిని అనుసరించని వారు ద్రోహులు. అతను నా భక్తుడైనా సరే వైష్ణవుడిగా పరిగణించబడడు. శృతి (వేదం), స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవన్నింటిని సమిష్టిగా శాస్త్రం అంటారు. శ్రీ కృష్ణ పరమాత్మ  భగవద్గీత 16.24 లో ఇలా ఉపదేశించారు, “తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే” – అందువల్ల శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి / ప్రమాణంగా స్వీకరించాలి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్నిఇలా ప్రారంభిస్తున్నారు,  “వేదార్థం అఱుధియిడువదు స్మృతి ఇతిహాస పురణంగలలే” – స్మృతి, ఇతిహాసాలు, పురాణాలలో వేదార్థాలు దృఢంగా వివరించబడ్డాయి. మాముణులు ప్రారంభించడానికి ఉత్తమ వివరణ ఇస్తున్నారు. ప్రమాతా (ఆచార్య – పూర్వాచార్యులు) ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని (లక్ష్యం)  స్థాపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వేదం అంతిమ ప్రమాణమని అద్భుతంగా స్థాపించారు. కాబట్టి, మొదట అత్యున్నత ప్రమాణమేదో తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన సహాయక సాహిత్యాలను సరైన గురువుల నుండి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తరువాత, మాముణులు జాబితా చేయబడిన అనేక విభిన్న సహాయక సాహిత్యాలు ఉన్నాయని,  వేదార్ధాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడటానికి అవి ఎలా విలువైనవో ఇక్కడ వివరిస్తున్నారు. దీన్ని సరిగ్గా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి, మనకు ప్రాథమిక సూత్రాల గురించి గొప్ప అవగాహన ఇస్తుంది.
  •  వివిధ సహాయక సాహిత్యాలలో, సాత్వికుల (మంచితనం / ధర్మ రీతిని పాఠించేవారు) చేత అంగీకరించబడిన సాత్విక అంశాలు, వాటిని వెల్లడి చేసే భాగాలు ప్రధాన ప్రమాణములు అని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఉప బృహ్మణం లో (సహాయక సాహిత్యం), ముఖ్యంగా పురణాలు, సాత్విక అంశాలు ప్రధాన ప్రమాణాలు. రాజస మరియు తామస అంశ విభాగాలు కూడా ఉన్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. అనువాదకుల గమనిక: మత్స్య పురాణంలో, “యస్మిన్ కల్పేతు యత్ ప్రోక్తం పురాణం బ్రహ్మణా పురా, తస్య తస్యతు మాహాత్మియం తత్ స్వరూపేణ వర్ణ్యతే” – సత్వ, రాజస లేదా తామస స్వభావం కలిగిన దేవతలను కీర్తిస్తూ, ఒక కాలంలో ఒక గుణం (సత్వ, రాజస లేదా తామస గుణం) ప్రధానంగా ఉన్నపుడు బ్రహ్మ పురాణాలను వెల్లడి చేసారు. ఈ స్లోకాన్ని పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క 3వ సూత్ర వ్యాఖ్యానంలో మాముణుల చేత కీర్తించబడింది. పురాణాలను సాత్విక కోణంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం గమనించాలి.  మన పూర్వాచార్యులు (శుద్ద సాత్వికులు) పురాణాల యొక్క సాత్విక భాగాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. పురాణముల యొక్క సాత్విక భాగాలు, శ్రీమన్నారాయణ మరియు వారి కీర్తిని వెల్లడిచేస్తాయి. దీనిపై వైష్ణవుల యొక్క ప్రధాన దృష్టి ఉంటుంది.
  • రాజస / తామస  వ్యక్తిత్వాలకు సంబంధించిన సాత్విక అంశాలు సాత్వికులకు అనుపధేయం (హితమైనవి కావు) అని తెలియకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మా, శివ, లింగం మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించిన పురాణాలలో, రాజస / తామస వ్యక్తిత్వం ఉన్నందున వాటికి సంబంధించిన సాత్విక భాగాలను స్వీకరించాలి. ఇక్కడ మూల గ్రంథములో దీనిని అనుపధేయం (హితమైనవి కావు) అని అంటారు – కాని ఇది అక్షర దోషం కావచ్చు. అది ఉపాధేయం (ఆమోదయోగ్యమైనది) అయి ఉండాలి. తిరువాయ్మొళి 6.10.8 లో నమ్మాళ్వార్ శివుని యొక్క సాత్విక గుణాన్ని ఇక్కడ మనకందిస్తున్నారు, “నుణ్ణుణర్విన్ నీలార్ కణ్డత్తమ్మానుం” – మహా జ్ఞాని అయిన శివుడు విషాన్ని మింగి ఈ విశ్వాన్ని రక్షించాడు, అందుకని వారి కంఠం నీలంగా ఉంటుంది అని కీర్తించారు. సత్వ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు తిరుమల వేంకటేశ్వరుని ఆరాధించడానికి వచ్చినందున ఇక్కడ ఆళ్వార్ శివుడిని కీర్తిస్తున్నారు. అలాగే, ప్రఖ్యాత ప్రమాణ  స్లోకమైన – “వైకుణ్టేతు పరే లోకే… ఆస్తే విష్ణురచింత్యాత్మా” లింగ పురణంలో కనిపిస్తుంది – ఈ స్లోకము ప్రతిరోజూ మంత్ర పుష్పం సమర్పిస్తూ తిరువారాధన సమయంలో శ్రీవైష్ణవులు పఠిస్తారు.
  • అరుళి చెయల్ (దివ్య ప్రబంధం) సాత్విక, రాజస, తామసం మొదలైన విభజన లేకుండా ఇది మచ్చలేనిదని దృఢ నమ్మకం ఉండకపోవడం ఒక అడ్డంకి. ఎందుకంటే ఇది శుద్ద సాత్వికులైన మన పూర్వాచార్యులు సంపూర్ణంగా స్వీకరించినది. అతి శుద్ధమైన భక్తి జ్ఞానంతో శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడిన ఆళ్వారుల దివ్య ప్రబంధములు కూడా శుద్ధమైనవి. వీటిని పవిత్రమైన మన పుర్వాచార్యులు స్వీకరించి అనుసరించారు. కాబట్టి, వాటిలో ఎటువంటి లోపానికి అవకాశం లేదు. ఈ సూత్రంపై బలమైన నమ్మకం శ్రీవైష్ణవులకు ఉండటం చాలా అవసరం.
  • పూర్వాచార్యుల దివ్య పలుకులు సాత్వికులకు అత్యంత ప్రామాణికమైనవని పూర్తిగా నమ్మకపోవడం ఒక అడ్డంకి. ఆళ్వారులు శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడినట్టుగా, మన పుర్వచార్యులు ఆళ్వారులచే అనుగ్రహింపబడ్డారు. వారి ఉపదేశాలను సంపూర్ణంగా స్వీకరించి కీర్తించాలి. అనువాదకుల గమనిక: ధర్మశాస్త్రంలో, “ధర్మజ్ఞ సమయం ప్రమానం వేదశ్చ” – గొప్ప వ్యక్తుల ఆలోచనలు / అభిప్రాయాలు ప్రామాణికమైనవి, వేదం కూడా ఒక ప్రమాణం. ఇక్కడ ధర్మజ్ఞ అంటే “ధర్మం తెలిసినవాడు” అని అర్ధం – మనకు భగవానుడు సిద్ద ధర్మం (ప్రామాణికమైన ధర్మసూత్రాలు), అందువల్ల ధర్మజ్ఞ  అనగా భగవాన్ యొక్క స్వభావాలు, నామాలు, రూపాలు, గుణాలు మొదలైన వాటి గురించి పూర్తి అవగాహన ఉన్న ఆళ్వారులు మరియు ఆచార్యులను సూచిస్తుంది.  కాబట్టి, మన పూర్వాచార్యుల సూక్తులపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. మణవాళ మాముణులు  ఉపదేశ రత్నమాలలో 36 “తెరుళుత్త ఆళ్వార్గళ్ చీర్మై  అఱివారార్, అరుళిచ్ చెయలై అఱివారార్, అరుళ్ పెత్త నాదముని ముదలాన నాం దేసికరై అల్లాల్ పేడై మనమే! ఉణ్డో పేచు” – జ్ఞానులైన ఆళ్వారుల నిజమైన కీర్తి ఎవరికి తెలుసు? దివ్య ప్రబంధాల యొక్క దివ్య అర్థాలు ఎవరికి తెలుసు? ఓ ప్రియమైన హృదయమా! ఆళ్వారులచే అనుగ్రహింపబడిన మన పూర్వాచార్యుల (నాథమునులతో ప్రారంభించి) లాంటి వారు ఎవరైనా ఉన్నారా? మన పూర్వాచార్యులకు సంబంధించి అనేక సంఘటనలు అనేక గ్రంథములలో నమోదు చేయబడ్డాయి. మన శ్రేయస్సు కోసం హృదయపూర్వక భక్తితో వాటిని మనం నిరంతరం అధ్యయనం చేయాలి, వినాలి, వాటిని గురించి చింతన చేయాలి, అనుసరించడానికి ప్రయత్నించాలి.
  • స్వయంగా శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన శ్రీ పాంచరాత్రంపై సంపూర్ణ విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన శ్రీ పాంచరాత్ర సంహితుల ప్రామాణికతపై సంకోచం కూడా ఉండకూడదు, దీనిని “భగవత్ శాస్త్రం” అని పిలుస్తారు. వేదానికి సమానంగా పరిగణించాలి. పరమాచార్య ఆళవందారులు మనకు “ఆగమ ప్రామాణ్యం” (ఆగమం – శ్రీ పాంచరాత్ర ఆగమం) అనే దివ్య గ్రంథమును ఆశీర్వదించారు, ఇది శ్రీ పాంచరాత్ర ఆగమం యొక్క ప్రామాణికతను వివరంగా తెలియజేస్తుంది.
  • అన్ని ప్రమాణములు భగవత్ స్వరూపంపై కేంద్రీకృతమై ఉన్నాయని నమ్మకం లేకపోవడం ఒక అడ్డంకి. భగవద్గీత 15.15 లో, కృష్ణ పరమాత్మ “వేదైశ్చ సర్వైర్ అహమేవ వేధ్యః” – వేదం నా గురించి మాత్రమే చెబుతుంది. వేదం యొక్క ఉద్దేశ్యం భగవానుడిని కీర్తించడమే. పెరియాళ్వార్  తిరుమొళి 2.9.6లో పెరియాళ్వారులు ఇలా వెల్లడి చేస్తున్నారు “వేదప్పొరుళే ఎన్ వేంకటవా” – వేదం యొక్క మూల బిందువైన ఓ వేంకట. ఇక్కడ భగవాన్ తన రూప, గుణ, ఐశ్వర్యం, స్వరూపం, నామాలు మొదలైనవాటితో సహా ఉన్నవాడు. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమానార్ తమ భాష్యం (వ్యాఖ్యానం) లో గీతా శ్లోకం 15.15 నికి సమతుల్యంగా ఉన్న మనుస్మృతి 12.9న్ని వివరించారు, “సరీరజైః కర్మ ధోషైః యాతి స్తావరతాం నరః, వచికైః పక్షి మృగతాం మానసైర్ అంత్యజాతితాం” – ఒక మనిషి తన చేతులతో ఇతరులను శారీరకంగా బాధ పెట్టినప్పుడు, అతను ఒక చెట్టులా పుడతాడు; అతను తన మాటలతో బాధ పెట్టినప్పుడు, అతను పక్షి / జంతువుగా పుడతాడు, అతను తన మనస్సు ద్వారా ఇతరులను బాధ పెట్టినప్పుడు, అతను అతి అల్ప వ్యక్తిగా జన్మిస్తాడు. ఇక్కడ వివిధ రకాలైన శరీరాలను (మానవుడు, చెట్టు, జంతువు మొదలైనవి) గురించి వివరిస్తున్నప్పటికీ, చివరికి అది జీవాత్మ యొక్క కర్మానుసారంగా వచ్చే జన్మ  గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా వేదం అగ్ని, వాయు, వంటి ఇతర దేవతల గురించి మాట్లాడినప్పుడల్లా, చివరికి అన్నింటిలో అంతరాత్మగా ఉన్న శ్రీమన్నారాయణుడను మాత్రమే సూచిస్తుంది. పెరియాళ్వార్ తిరుమొళి పాసుర వ్యాఖ్యానానికి, మాముణులు ఈ గీతా శ్లోకాన్ని ఉల్లేకిస్తూ ఈ పాసురాన్ని,  “తిరుమల వేంకటేశ్వరుని రూపంలో వేదం యొక్క మూల బిందువు నా ముందు ఉంది” వారు అందంగా వివరించారు.
  • చిత్ మరియు అచిత్తులతో కూడి ఉన్న పరమాత్మనే అన్ని వాక్కుల పరమార్థం అని మనం అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మ  శ్రీ రామాయణంలో శ్రీ రాముని ఇలా కీర్తించారు, “భవాన్ నారాయణో దేవః జగత్ సర్వం శరీరం తే” – నీవే నారాయణుడవి, సర్వోన్నత దేవుడివి. ఈ విశ్వమంతా నీ శరీరం. ఏది చూసినా, విన్నా, అవన్నీ పరబ్రహ్మ శ్రీమన్నారాయణ శరీరమే. ఆయన ప్రత్యక్షంగా జీవాత్మలలో వ్యక్తమవుతాడు, జీవాత్మ ద్వారా అచిత్లో వ్యక్తమవుతాడు. నామం రూపం ఉన్నదేదైనా అందులో  భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని వివరించబడింది. అనువాదకుల గమనిక: వేదార్థ సంగ్రహంలో, వేదాంతం నేర్చుకున్నవాడు ప్రతిదానిలోనూ భగవాన్ని చూస్తాడు అని శ్రీ రామానుజులు వివరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మేకను చూసినప్పుడు, వారు ఆ మేకలో ఉన్న జీవాత్మను చూస్తాడు, ఆ జీవాత్మ లోపల ఉన్న పరమాత్మను చూస్తాడు. కానీ వేదాంతం నేర్చుకోని వాడు, మేకను మాత్రమే చూస్తాడు, ఎందుకంటే అతను  తత్వ త్రయ సిద్ధాంతం – చిత్, అచిత్ మరియు ఈశ్వరుని గురించి తెలియని వాడు కాబట్టి.
  • భగవానుడు  ప్రతి ఒక్కరిలో నివసించే ఆత్మ అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మునుపటి వివరణ మాదిరిగానే. అనువాదకుల గమనిక: నారాయణ సూక్తంలో “అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ  స్తితః” – అంతటా శ్రీమన్నారాయణ వ్యాపించి ఉన్నాడు. ఇదే సూత్రాన్ని నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 1.1.10 లో “పరంద తాణ్ పరవైయుళ్ ణీర్ తొఱుం పరందుళన్ పరంద అణ్డం ఇదెన నిల విశుంబు ఒళివఱ కరంద సిల్ ఇడం తొఱుం ఇడం తిగళ్ పొరుళ్ తొఱుం కరందు ఎంగుం పరందుళన్ ఇవై ఉణ్డ కరనే” – భగవాన్ సముద్రములో ఉన్న చిన్న నీటి బిందువులో ఉన్నట్టే విరాటస్వరూపంగా ఈ విశ్వంలో కూడా అంతే సులభంగా వ్యాపించి ఉన్నాడు. అదేవిధంగా, అతను ఈ భూమిపైన, పై గ్రహాలు మొదలైన వాటిలో కూడా నివసించి ఉన్నాడు, జీవాత్మలు నివసించే అతి సూక్ష్మ ప్రదేశాలలో కూడా ఉన్నాడు. జీవాత్మలు అతని ఉనికిని గ్రహించక పోయినా భగవాన్ అక్కడ ఉంటాడు. అటువంటి సర్వవ్యాపి అయిన భగవానుడు సంహారం (ప్రళయ) సమయంలో అన్నింటినీ తనలోకి తీసుకుంటాడు, తన లోపల ఉంచుకొని రక్షిస్తాడు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/09/virodhi-pariharangal-37/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment