శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – అయోధ్యా కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

<< బాల కాండం

అందరు శ్రీ అయోధ్యకి చేరి ఆనందంగా జీవించారు. శ్రీరాముడు మరియు సీతమ్మవారు సంతోషముగా 12 సంవత్సరాలు కలిసి ఉన్నారు.

ఒక్కసారి, దశరథ చక్రవర్తి తన కుమారుడు అయిన శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని కోరుకున్నారు. తను ఒక్క పెద్ద ప్రజల సమూహాన్ని పిలిచి తన అభిలాషను తెలిపి వారి సలహాలను అడిగారు, అప్పడు వారందరు ముక్త కంఠంతో వారి సమ్మతిని తెలిపారు. చక్రవర్తి కూడా, సంతోషం గా, కులగురువు అయిన వశిష్ఠుణ్ణి సంప్రదించి పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించారు. ఆ నగరాన్ని పూర్తిగా అలంకరించారు. శ్రీరాముడు తగిన కర్మలు చేసి, తరువాత రోజు ప్రాతకాలం పట్టాభిషేకాన్ని సిద్ధపడ్డారు.

ఆ సమయంలో, కుబ్జ అయిన మంథర( కైకేయి దాసి), కైకేయి మనస్సుని కలిచివేసి, తనను దశరథుని నుండి రెండు వరాలు కోరమని ప్రేరేపించింది 1)భరతునికి రాజ్యాభిషేకం 2)రామునికి వనవాసం. దశరథుడు మొదట మూర్ఛిల్లినప్పటికీ తేరుకుని, కైకేయిని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు. అప్పుడు వారు శ్రీరాముడిని పిలిచి “కులకుమారా! కాడుఱైయ పో” (ఓ కుల దీపమా! అడివికి వెళ్ళు) అని ఆజ్ఞాపించారు. అది విన్న రాముడు కొంత కూడా బాధపడకుండా సంతోషంగా ఆజ్ఞను స్వీకరించారు.

తను ఆ మహోనతమైన దేశం, గొప్ప రాజ్యం కాదని, తన తల్లులని వదిలి, రథాలు ఏనుగులు కాదని, ఆభరణాలు త్యజించి నారవస్త్రాలు మరియు జింక చర్మం కట్టుకుని, దివ్యమైన సౌందర్యం పెరిగినట్టుగా నిలిచాడు.

ఆ సమయం లో, సీతమ్మవారు, శ్రీరాముడి వెంట అడివికి వస్తాను అని బలవంత పెట్టారు. మొదట వారు ఒప్పుకోన లేదు. కానీ సీతమ్మవారు శ్రీరాముడు ఉన్న చోటు తనకు స్వర్గం అని లేని చోటు నరకం అని మరింత పట్టుబట్టారు, తర్వాత ఒప్పుకున్నారు. అటుపిమ్మట, సీతా అమ్మవారు సిఫారసుతో లక్ష్మణుడు కూడా శ్రీరాముడి దివ్య తిరువడిని (పాదాలని) ఆశ్రయించాడు. శ్రీరాముడు మొదట నిరాకరించినప్పటికీ తర్వాత అది కూడా స్వీకరించారు. ఈ విధముగా, శ్రీరాముడు ధనుర్ధారిగా, సీతమ్మవారు మరియు లక్ష్మణ స్వామి ధనుస్సు, ఖడ్గంతో వారి ప్రయాణాన్ని అడివి వైపుగా మొదలు పెట్టారు.

మొదటగా వారు శ్రీ అయోధ్య పట్టణ మంత్రి అయిన సుమంత్రుడి రథం అధిరోహించి, చాలా దూరం ప్రయాణించి రాత్రి ఒక చోట విశ్రమించారు. శ్రీ అయోధ్యా పట్టణ వాసులు అనేకులు వారితో పాటుగా ప్రయాణించారు. వారు నిద్ర లేచే ముందు, శ్రీ రాముడు, సీతా అమ్మవారు మరియు లక్ష్మణ సమేతముగా, సుమంత్రుడి రథంలో జనులకు దూరముగా ప్రయాణించారు. వారు తమసా నది తీరానికి చేరారు. వారు నదిని దాటి, జింకలు, ఏనుగులు, గుర్రాలు ఉన్న అడివి దాటి, వేదశృతి నది తీరం చేరారు. వారు ఆ నదిని మరియు గోమతి, స్యంధికా అని రెండు నదులను దాటి, శ్రీ అయోధ్యా సరిహద్దు వదిలి గంగా తీరాన్ని చేరుకున్నారు. అక్కడ గుహుడి నాయకత్వం లో బోయవాళ్లు వారికి సహాయం చెయ్యటానికి అక్కడికి చేరుకున్నారు. శ్రీరాముడు గుహుడిని హత్తుకుని తన సహోదరుడిగా స్వీకరించారు. గుహుడు ఆహార పదార్థాలను సమర్పించగా శ్రీరాముడు వాటిని తిరస్కరించారు. కానీ అందరు కూడా గుహుడి రక్షణలో అక్కడే రాత్రి విశ్రమించారు, తరువాత రోజు గుహుడి సహాయంతో గంగా నదిని దాటారు. అనంతరం వారు భరద్వాజశ్రమం చేరి వారి ఆశీసులు పొంది, చివరకు చిత్రకూటం అనే గిరిని చేరారు. సుమంత్రుడు వారికి వీడుకోలు చెప్పి, శ్రీ అయోధ్యాకు తిరిగి వెళ్లిపోయారు. తను శ్రీ రాముడి క్షేమ సమాచారం అందరికి చెప్పారు. అది విన్న దశరథుడు, తనను తాను నిందించుకుంటూ చాలా బాధపడి, స్వర్గానికి ప్రయాణం అయ్యారు. భరతుడు శ్రీ అయోధ్య చేరి, ఈ విషయాలు విని, తన తల్లి కైకేయి పట్ల విపరీతమైన కోపంతో ఊగిపోయారు మరియు తన తండ్రికి అంత్యసంస్కారాలు చేశారు. ఇక వశిష్ఠాదులు, భరతుడికి పట్టాభిషేకం చేస్తాము అని సంకల్పించగా, తను నిరాకరించారు. భరతుడు, అందరితో కలిసి చిత్రకూటం వెళ్లి శ్రీరాముడిని తిరిగి రమ్మని ప్రార్థిదాం అని సూచించారు. అందుకు అందరు సమ్మతించి భరతుడితో పాటుగా, తన తల్లులు, వశిష్ఠాది మహర్షులు, అయోధ్యా పుర వాసులు, గజ అశ్వ సైన్యాలు తో కలిసి, చిత్రకూటం వైపు ప్రయాణం అయ్యారు.

ఇక్కడ అడివిలో, లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించారు. వారు ముగ్గురు పక్వమైన మరియు అపక్వమైన పండ్లు తింటూ, నేలపై విశ్రాంతి తీసుకోవడం మొదలైనవి చేస్తూ సాధారణంగా జీవించారు. భరతుడు అక్కడికి పెద్ద సమూహంతో పాటు గా వచ్చి శ్రీ రాముడి దివ్య తిరువడిని (పాదాలను) ఆరాధించి, శ్రీ అయోధ్యాకు తిరిగి రమ్మని ప్రాధేయపడ్డారు. కానీ శ్రీరాముడు పూర్తిగా నిరాకరించి తన పాదుకలను భరతునకు ఇచ్చారు. భరతుడు అవి స్వీకరించి అందరితో కలిసి శ్రీ అయోధ్యా నగర సరిహద్ధు చేరారు. అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని, పాదుకలకు పట్టాభిషేకం చేసి, వాటి నాయకత్వంలో రాజ్య పరిపాలనం చేశారు.

అనంతరం, శ్రీ రాముడు, సీత, లక్ష్మణ సమేతముగా చిత్రకూటం విడిచి దండకారణ్యం చేరారు.

సారం

  • శ్రీ రాముడి గుణాలు చాలా గొప్పవి, దశరథుడు, జనులకు కష్టం లేకుండా, ఎంతో ధర్మం పరిపాలన చేసినప్పటికీ, శ్రీ రాముడి వైభవం తప్ప వారు ఎవరి వైభవం అర్థం చేసుకోలేకపోయారు.
  • కైకేయి, మంథర విషపు మాటలు విని, పరమపురుషుడు అయిన శ్రీరాముడి పట్ల తనకు ఉన్న విపరీతమైన ప్రేమను పోగొట్టుకుంది. అలానే, మనం కూడా లౌకిక విషయాల్లో చిక్కుకపోయి, మనం కూడా తప్పులు చేస్తాము.
  • దశరథుడు ధర్మాత్ముడు అయినప్పటికీ, తాను సత్య వాక్కు పరిపాలన అనే సామాన్య ధర్మం పాటించినప్పటికీ, పరమపురుషుడు అయిన శ్రీరాముడిని అడివికి పంపకుండా కాపాడాలి అనే విశేష ధర్మం గురించి ఆలోచించలేదు. కనుక, వారు అవివేకులు అని తెలుస్తుంది.
  • సీతమ్మవారు మరియు లక్ష్మణుడు ఇద్దరూ మనకి భగవానుడితో పాటు ఉండటమే నిజమైన సంతోషమని, తన నుండి వేరుపడటమే నిజమైన దుఃఖమని చూపించారు.
  • భగవానుడి కళ్యాణ గుణాలు, గుహుడిని దోషాలు చూడకుండా స్వీకరించటం ద్వారా ప్రకటం అవుతున్నాయి.
  • భరతుడు, భగవానుడికి పరతంత్రుడు ఎలా ఉండాలో ప్రదర్శించారు. పారతంత్ర్యం అనగా పూర్తిగా భగవానుడి సంకల్ప ప్రకారంగా వ్యవహరించటం.
  • భరతుడు సక్రమంగా శరణాగతి చేసి రాముడిని తిరిగి రమ్మని కోరినప్పటికీ. శ్రీరాముని సంకల్పం దానికి భిన్నంగా అడివికి వెళ్ళాలి అని సంకల్పించటం చేత, అది ఫలించలేదు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, మన శరణాగతి కన్నా భగవానుని దివ్య సంకల్పమే మన నిజమైన శ్రేయస్సుకు కారణం.

అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్ 

మూలం — https://granthams.koyil.org/2024/11/15/srirama-leela-ayodhya-kandam-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment