శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – కిష్కిందా కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

<< ఆరణ్య కాండం

శ్రీరాముడు లక్ష్మణుడితో పాటు పంపా సరోవర తీరం చేరగానే, అక్కడి ప్రకృతి సౌందర్యం చూసి, సీత అమ్మవారిని వీడిన విరహ వేదన కారణంగా తాను ఇక్కడ సౌందర్యాన్ని అనుభవించ లేకపోతున్నందున దుఃఖితుడు అయ్యాడు. ఆ సమయంలో ,అన్న వాలి తో ఉన్న వైరం కారణం చేత, ఋష్యముఖ పర్వతం పై అజ్ఞాతవాసంలో ఉన్న సుగ్రీవుడు వీరి ఇరువురి రాకను గమనించాడు. అక్కడ తాను జాంబవంతుడు, హనుమంతుడు మొదలైన వారితో ఉన్నాడు. రామ లక్ష్మణులను చూసిన సుగ్రీవుడు అన్న వాలి పంపి ఉంటాడు అని భయపడ్డాడు. అది గమనించిన హనుమంతుడు వారి వివరాలు కనుకోవటానికి వెళ్లాడు.

హనుమంతుడు, బ్రాహ్మణ వేషంలో వారిని చేరి, శ్రీ రాముడు పరబ్రహ్మం అని తెలుసుకుని, ఎంతో సంతోషించాడు, వారికి సర్వదా దాసుడిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసుకుని, వారి వివరాలను కనుకున్నారు. లక్ష్మణుడు జరిగిన సంఘటనలు అన్నీ వివరించి తాము ఇప్పుడు సుగ్రీవుడిని కలవటానికి వచ్చాము అని తెలిపాడు. ప్రసన్నముతో హనుమంతుడు తన నిజ స్వరూపంలో వారిని పూజించి, వారిరువురిని సుగ్రీవుడి వద్దకు చేర్చి, వారి మనోరథాలను సుగ్రీవుడికి తెలిపాడు, సుగ్రీవుడు చాలా సంతోషించాడు. శ్రీరాముడు మరియు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు. శ్రీ రాముడు, సుగ్రీవుడిని తన తమ్ముడిగా స్వీకరించాడు.

శ్రీ రాముడు, వాలిని ఓడించి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తాను అని మాట ఇచ్చినప్పటికీ, సుగ్రీవుడు విశ్వసించలేదు. అప్పుడు, శ్రీ రాముడు, ఏడు శాల వృక్షాలను పడకొట్టాడు. అటుపిమ్మట సుగ్రీవుడికి నమ్మకం కలిగింది. సుగ్రీవుడు వెళ్లి, వాలిని యుద్ధానికి పిలిచాడు, ఇద్దరు యుద్ధం చేస్తున్న సమయంలో, శ్రీరాముడు వాలిని సంహరింప ప్రయత్నించినప్పటికీ, వారి రూపు-రేఖలు ఒకేలాగ ఉండటం చేత సంహరించలేక పోయాడు. సుగ్రీవుడు తిరిగి వెళ్లి వాలిని యుద్ధానికై పిలిచాడు. ఈ సారి సుగ్రీవుడిని వేరు పరిచే విధముగా పూలదండను ఏర్పర్చారు. ఒక్క భీకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో, శ్రీ రాముడు చెట్టు చాటునుండి వాలిని వధించాడు.

శ్రీరాముడి బాణాన్ని చూసిన వాలి, శ్రీరాముడి చేష్తితం ధర్మబద్ధమా అని ప్రశ్నించాడు. శ్రీరాముడు అతనిని ఓదార్చి ధర్మాన్ని వివరించాడు, మరియు అతనికి ఉత్తమ గతులను ప్రసాదించారు. అటు తర్వాత శ్రీ రాముడు, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు.

అటు పిమ్మట, నాలుగు నెలలు వర్షాకాలం మరియు శరదృతువు అయ్యాక శ్రీరాముడికి సహాయం చేస్తాను అని మాటిచ్చాడు కానీ రాజ్య భోగముల్లో పడి మర్చిపోయాడు. శ్రీరాముడు వేచి చూసి. సుగ్రీవుడిని సంస్కరించి, సీతా అన్వేషణం మొదలుపెట్టటానికి లక్ష్మణుడిని పంపాడు.

సుగ్రీవుడు అసంఖ్యమైన వానర సైన్యాన్ని అన్ని దిక్కులకు పంపించాడు. ఆ సమయంలో శ్రీరాముడు హనుమంతుడికి తన ఉంగరాన్ని ఇచ్చి సీతమ్మవారికి చూపమని చెప్పారు. ఉత్తర, పడమర, తూర్పుకు వెళ్లిన వానరములు అపజయం కలిగి తిరిగి వచ్చారు. దక్షిణ వైపు వెళ్లిన హనుమంతుడు మొదలైన వారు, జటాయువు యొక్క అన్న అయిన సంపాతి, తన మెరుగైన దృష్టి తో సీతఅమ్మవారిని లంకలో దర్శించి, వారికి చెప్పాడు.

అతి బలవంతుడైన హనుమంతుడు, తన బలంతో, సముద్రాన్ని దాటి లంక చేరాడు, అన్నిచోట్ల వెతికి, చివరగా దయనీయమైనా స్థితిలో అశోకవనం లో దర్శించాడు. ఆమె తన జుట్టు తో ఊరి వేసుకోవటానికి సిద్ధపడ్డారు. హనుమంతుడు, శ్రీరాముడి చరిత్ర విన్నపించి, తాను రామదూత అని తెలిపి, శ్రీరాముడి ఉంగరాన్ని అందించాడు. అదీ చూసిన అమ్మవారు భావముల్లో మునిగిపోయారు. హనుమంతుడు అమ్మవారికి శ్రీరాముడికి మధ్య జరిగే సంఘటనలు తెలిపి ఇంకా నమ్మకం పెంపొందించాడు.

సారం

  • తన అవతారాల్లో కూడా, అమ్మవారిని వదిలి స్వామి ఉండలేరు, కాబట్టే అంతటా వెతకగా అమ్మవారు దొరకలేదు అని దుఃఖించారు.
  • నిజమైన భక్తులు, ఆ స్వామిని చూడగానే మహానందం పొందుతారు, అదే సమయముల్లో స్వామికి సంపూర్ణ శరణాగతి చేస్తారు, హనుమంతుడు చేసిన విధాముగా.
  • సాక్షాతుగా స్వామే ఈ లోకములో అవతరించినప్పటికీ, తన గుణాలను దాచి ఉంచారు, కావునా సుగ్రీవుడు కుడా శ్రీరాముడిని పరీక్షించే నమ్మాడు. ఇదే ఈలోకం తీరు.
  • వాలి వధ చాలా వివాదస్పదమైన ఘట్టం. కానీ ఆ సమయములో శ్రీరాముడు వాలికే నేరుగా వివరించి, ఒప్పించారు. వాలి తమ్ముడి పట్ల మోసం చేశాడు, సొంత తమ్ముడు భార్యను అపహరించాడు కావున శిక్షార్హుడు. వానరాలు జంతువులు కారణం చేత వాటిని చాటునుండి చంపటం తప్పు కాదు.
  • సుగ్రీవుడు కర్తవ్యం మర్చినప్పటికీ, శ్రీరాముడు లక్ష్మణుడు ద్వార కర్తవ్యబోధ చేశారు, దీనిబట్టి, భగవంతుడు భక్తుల తప్పులు సవరించటానికి ఎంతో ప్రయత్నిస్తాడు.
  • శ్రీరాముడు, హనుమంతుడికి ఉంగరాన్ని ఇచ్చారు కాబట్టి, ఆ క్షణమే హనుమంతుడు అమ్మవారిని కనిపెడతాడు అని స్పష్టమైంది.
  • హనుమంతుడు, అమ్మవారి ఆవేశపూరితమైన నిర్ణయాన్ని తన చక్కటి మాట ద్వార తప్పించిన కారణం చేత అమ్మవారి మరియు తద్వారా స్వామి ప్రాణాన్ని కాపాడాడు. కావున ఇది ఉత్తమమైన కైంకర్యం.

మూలం — https://granthams.koyil.org/2024/11/23/srirama-leela-kishkindha-kandam-english/

అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment