రామానుజుల వారి అపారమైన కరుణ

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ramanuja-1తిరువరన్గత్తు అముదనార్లు వారి “రామనుజ నుత్తన్దాది” అను గ్రంధము నందు 25వ పాసురమున వారు ఎమ్పెరుమానార్లను (రామనుజులను) ఈ విధముగ కీర్తించారు “కారేయ్ కరుణై ఇరామానుస“.

ఇందున ఎమ్పెరుమానార్లను మేఘములుగా పోల్చారు. మేఘములు ఎంతో ఉతమమైనవి కావున ఈ విధముగ పోలిక చెప్పినట్లు మనకి తెలుస్తుంది. మేఘములు  ఉతమమైనవిగా పేర్కొనుటకు కల కారణములు:

  • మేఘములు ఎవ్వరు అర్ద్ధించకున్నప్పట్టికిని సముద్రము నన్దు నీరును భూమి మీదకు తెచ్చును .
  • మేఘములు మంచి – చెడు, ధనవంతుడు – పేదవాడు అను భేధములను చూపక  చల్లటి వర్షపు రూపములొ అందరికి నీరును అందించును.
  • మేఘములు నల్లటి వర్ణము కలిగి, పుష్కలముగ నీరు వున్డునట్లు కనిపించుచు, అందరికి నీటిని అందించుటకు సిద్ధముగ ఉండునట్లు శోభించును.

అదే విధముగ ఎమ్పెరుమానార్లు శాస్త్రము యొక్క సారమును అర్హత – అనర్హత విచారణ చేయక; అందరి జనులయందు భేద భావములు చూడక అందిచినారు. వారు అందరిపట్ల పరమ కారుణ్యముతో  వారిని ఆధ్ద్యత్మికంగా  ఉద్ధరించుటకు భాసిల్లిరి.

పిళ్ళై లోకాచర్యులు వారు రచించిన “శ్రీవచనా భుషణం” అను గ్రంధమున వారు పెరియళ్వార్ మరియు ఎమ్పెరుమానార్లు యొక్క ఉత్తమమైన గుణమును ఈ విధముగ ప్రస్తావించారు:

పెరియళ్వార్లకు భగవంతునికి మంగళాశాసనము చేయుట విషయములొ సాంప్రదాయము నందు పెద్ద పీఠ వేస్తారు. వారు ఎల్లప్పుడు శ్రీమన్నారాయణునికి మంగళాశాసనము చేస్తూనే ఉంటారు. 255 సూత్రమునందు , ఎమ్పెరుమానార్లు కూడా అదే విధముగ భగవంతుని యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తున్టారు అని పేర్కోన్నారు.

periyazhwar-ramanujar అల్లాతవర్కళైప్ పోలే కేట్కిఱవర్కళుడైయవుమ్, చొళ్ళుకిఱవర్గళుడైయవుమ్ తనిమైయైత్ తవిర్క్కైయన్ఱిక్కే, ఆళుమాళార్ ఎన్గిఱవనుడైయ తనిమైయైత్ తవిర్క్కైక్కాయిఱ్ఱు భాశ్యకారరుమ్ ఇవరుమ్ ఉపతేచిప్పతు

அல்லாதவர்களைப் போலே கேட்கிறவர்களுடையவும், சொல்லுகிறவர்களுடையவும் 
தனிமையைத் தவிர்க்கையன்றிக்கே, ஆளுமாளார் என்கிறவனுடைய தனிமையைத் 
தவிர்க்கைக்காயிற்று பாஷ்யகாரரும் இவரும் உபதேசிப்பது

అనువాదము:
అందరి అచార్యుల / ఆళ్వారుల ఉపదేశములా కాకుండ పెరియళ్వార్ మరియు రామానుజులవారు వారి శిష్యులకు భగవంతుని యొక్క ఏకాoతమును పోగొట్టు దాసులుగ మెలుగునట్లు తీర్చిదిద్దేవారు.

మామునిగళ్ వారు ఆ గ్రంధ వ్యాఖ్యానము నందు ఈ విషయము ఎంతో అందముగ ప్రతిపాదించారు:

  • ఇతర అచార్యులు/ఆళ్వారులు జీవులకు ముఖ్యముగ జ్ఞానోపదేశము చేసి వారిని సంసార సాగరము నుండి ఉద్ధరించెడి వారు
  • వారు వారి శిష్యులకు భాగవత శేవ యందు ప్రీతిని కలిగించి వారిని చక్కని భాగవతులుగా తీర్చి సంసారము నందు వారిని వారి సాంగత్యమును వీడక ఉండునట్లు చేసి వారిని కాపాడేవాళ్లు.
  • కాని పెరియాళ్వార్ మరియు రామానుజులు వారు మాత్రము ఎల్లప్పుడు ఆ శ్రీ హరి యొక్క దివ్య మంగళ విగ్రహము మీదనే ధ్యాస ; పెరుమాళ్ యొక్క క్షేమము, శుఖమును మాత్రమే కాంక్షిoచే వారు.
  • పిళై లోకాచార్యులు పైన చెప్పిన స్తోత్రము నందు రామానుజులను “భాష్యకారర్” అని ప్రతిపాదించడములోని వైశిష్ట్యమును మాముణులు అద్భుతముగ వర్ణించారు. వేదాన్తమునకు, వేదాన్త సూత్రములకు భాష్యమును రచించి లోకానికి “శ్రీ భాష్యము” రూపములో అందించారు రామానుజులు.  అందువలన వేదాన్త సారము పెరుమాళ్ మంగాళా శాసనమే అని మనము అర్ధము చేసుకొనవచ్చును.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు విరచితమయిన “ఆచార్య హ్రుదయం చూర్ణికై” 204వ స్తోత్రము నందు సీతాపిరాట్టి ( శ్రీ మహాలక్శ్మి ), ప్రహ్లాదాళ్వాన్, విభీషణాళ్వాన్ , నమ్మళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ల యొక్క నిర్హేతుక కారుణ్యము గురించి వివరించారు:

తాయ్క్కుమ్ మగనుక్కుమ్ తమ్బిక్కుమ్ ఇవర్క్కుమ్ ఇవరడి పన్ణిణ్తవర్క్కుమే ఇవైయుళ్ళతు

தாய்க்கும் மகனுக்கும் தம்பிக்கும் இவர்க்கும் இவரடி பணிந்தவர்க்குமே இவையுள்ளது

అనువాదము :
అమ్మ (సీతమ్మ), తనయుడు(హిరణ్యకశ్యపుడి తనయుడు  ప్రహ్లాదుడు), చిన్న తమ్ముడు (రావణుడి చిన్న తమ్ముడు విభీషణుడు), అతడు(నమ్మళ్వార్లు), అతని యందు శరణాగతి చేసినవాడు( ఎమ్పెరుమానార్లు); వీరికి మాత్రమే ఈ గుణములు కలవు

మాముణులు వారి వ్యాఖ్యానమున ఈ గుణములను గూర్చి ఈ విధముగ చెప్పారు

ఈ గుణములు ఏమనగ:

  • సంబంధ జ్ఞానము – ప్రతి జీవాత్మ (సంసారము మరియు పరమపదము నందు) భగవంతుడితో సంబంధము కలిగియుండును ముఖ్యముగ పిత – పుత్ర (తండ్రి – తనయుడు) సంబంధము మరియు శేషి – శేష ( యజమాని – దాసుడు) సంబంధము . కొందరు
    తెలుసుకొందురు, మరి కొందరు తెలుసుకొనలేరు.
  • జీవాత్మల పాప కర్మలను చూచి ధుఃఖ పడుట – అజ్ణ్యానము చేత జీవాత్మలు వారి స్వరూపమునకు విరుధ్ధముగ అనేక కర్మలు చేసుట చూచి ధుఃఖ పడుట.
  • పరమ కారుణ్యము – భగవంతుడు ఈ జీవాత్మల పాపపు చేష్టితములను చూచి
    విసుగు చెందును.అయినప్పటికి; ఈ భాగవతోత్తములు పరమ కారుణ్యముతొ ఈ జీవాత్మల స్ధితిని చూచి వారికి జ్ఞానబొధ చేసి వారికి భగవంతుడితో సత్-సంబంధమును కుదుర్చి వారికి సహాయమును చేయును.
  1. సీతా పిరాట్టి కారుణ్య హ్రుదయము కలదై; తన యందు రావణుడి ఆలోచనలు తెలిసినప్పటికిని; రావణుడిని సత్ప్రవర్తన మార్గములొ పెట్టుటకు హితబోధ చేసెను. ఒక తల్లి తన బిడ్డ చేసెడి తప్పిదములను ఏవిధముగ క్షమించునో అదే విధముగ సీతమ్మ రావణుడి తప్పులను మన్నించెను.ఆపై రావణుడికి శ్రీ రామునితో స్నేహము చేయమని; తనను తాను రక్షించుకొనమని కూడ చెప్పెను. sita_advising_ravana
  2. ప్రహ్లాదుడు తన తండ్రియగు హిరణ్యకశ్యపుడు తనని విష్ణు భక్తుడిగ ఉన్నందుకు ఎంత శిక్షించినప్పటికి వేదాన్తము యొక్క సారమును బోధించెను.అదే విధముగ (గురుకులము నందుగల) అసుర పుత్రులకు వారు అడగకున్నప్పటికి  పరమ ఉత్క్రుష్టమైన భక్తి మార్గమును ఉపదేశిoచెను. prahladha
  3. నమ్మాళ్వార్లు నిర్హేతుక కారుణ్యముతొ సంసార సాగరమున చిక్కుకొని; బయటపడలేని జీవులకు భగవద్విషయమును బోధించిరి.nammazhwar
  4. చివరిగ; నమ్మాళ్వార్ల పాద పద్మములుగ పరిగణించపడె ఎమ్పెరుమానార్లు అనేక కష్టములకోర్చి శాస్త్ర రహస్యములను నేర్చుకొని; ఎవరైతే జిగ్ఞాశ కలిగియున్నారో వారికి అర్హత – అనర్హత విచారణ చేయక జ్ఞానమును అందించినారు. వారు ఎంతో ప్రయాసకోర్చి వారి శిష్యులను గురువులుగా; సిమ్హాసనాధిపతులుగా నియమించి శాస్త్ర రహస్యములను తెలుసుకొవాలి అనే కొరికను అర్హతగ భావించి జ్ఞానమును అందించవలసిందిగ ఆదేశించెను. swamy-in-unjal

ఎమ్పెరుమానార్ల అనంతమయిన కీర్తిని “చరమోపాయ నిర్ణయమ్” అను అద్భుతమయిన గ్రంధమున నాయనారాచ్చాన్ పిళ్ళైవారు మనకు ప్రసాదించారు.

మామునులచే విరచితమయిన “ఉపదేశ రత్నమాలై” అను గ్రంధమున ఎమ్పెరుమానార్లను అందరు ఏ గుణమును చూచి కీర్తించురో పొందుపరిచారు. 37వ పాసురమున ఎమ్పెరుమానార్లకు వారి ముందు ఉన్న ఆచార్యపురుషులకు గల భేదమును విశ్లేషించారు.

ఓరాణ్ వళియాఇ ఉపడేసిట్తార్ మున్నోర్
ఎరార్ ఎతిరాసరర్ ఇన్నరుళాల్
పారులగిల్ ఆసై ఉడయోర్క్కెల్లామ్ ఆరియర్గాళ్ కూరుమ్ ఎన్ఱు
పేసి వరమ్భరుత్తార్ పిన్

ஓராண் வழியாய் உபதேசித்தார் முன்னோர்
ஏரார் எதிராசர் இன்னருளால் 
பாருலகில் ஆசை உடையோர்க்கெல்லாம் ஆரியர்காள் கூறும் என்று  
பேசி வரம்பறுத்தார் பின்

అనువాదము
ఎమ్పెరుమానార్లకు ముందు ఉన్న ఆచార్య పురుషులు తమ శిష్యులలొ శ్ర్ఱేష్టులగు వారిని ఎన్నుకొని, వారిని పూర్తిగ పరీక్షించి, వారిచే శేవలు పొంది అప్పుడు తృప్తిపడిన తరువాత వారికి శాస్త్రరహస్యములను ఉపదేశము చేసేవారు. కాని ఎమ్పెరుమానార్లు వారిలా కాకుండ; ఎంతో కష్ట పడితే తప్ప దొరకని ఆ జ్ఞానమును (భగవద్విషయమును) అందరికి అందించాలి అని 74 ఆచార్యులను(వారి శిష్యులను) ఏర్పాటు చేసి; నేర్చుకోవాలనే ఉత్సాహముకలవారి అందరికి భోదచెయమని ఉపదేశించెను. ఎమ్పెరుమానార్లే కొన్ని సమయములందు స్వయముగ వారే అడిగిన వారికి ఉపదేశించెను. ఆచార్యపురుషులలొ ఎమ్పెరుమానార్లకు ముందు వారిని “అనువృత్తి ప్రసన్నాచార్యులు” (శిష్యులచే శేవ పొందిన పిదప ఉపదేశము చేసేవారు) గ పేర్కొందురు. అయితే; ఎమ్పెరుమానార్లు మాత్రము మొదటి “కృపామాత్ర ప్రసన్నాచార్యులు” (కారుణ్యముతొ శాస్త్ర రహస్యములను ఉపదేశము చేసిన ఆచార్యులు )గ ప్రసిద్ధిని పొందారు.

ఈ విధముగా; మనము ఎమ్పెరుమానార్ల కీర్తిని తిరువరన్గత్తు అముదనార్,  పిళ్ళై లోకాచార్యర్,  అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, నాయనారాచ్చాన్ పిళ్ళై మరియు మనవాళ మామునిగళ్ వారి మాటలలో చుశాము. ఇందువలన మన ఆచార్యులు ఎల్లప్పుడు ఎమ్పెరుమానార్లే మనకు ఆశ్రయముగ చెప్తారు అనడంలొ అతిశయోక్తి లేదు. మనము కూడ ఎమ్పెరుమానార్ల పాద పద్మములు మాత్రమే మనకు ఆశ్రయముగ పరిగ్రహించి తరించుదాము.

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

Source:

https://ponnadi.blogspot.co.uk/2013/05/unlimited-mercy-of-sri-ramanuja/

0 thoughts on “రామానుజుల వారి అపారమైన కరుణ”

Leave a Comment