శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  పాఠక మార్గనిర్ధేశిక

srivaishna-guruparamparai

శ్రీమన్నారాయణుడు  తన నిర్హేతుక కృపా కటాక్షములచే  ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి సృష్ఠి సమయాన బ్రహ్మకు శాస్త్రములను (వేదాలు) ఉపదేశిస్తాడు. వైదికులకు వేదం అత్యంత ప్రామాణీకరణమైనది. ప్రమాత (ఆచార్యుడు) ప్రమేయమును (భగవానుడు) ప్రమాణం(శాస్త్రం) చేత మాత్రమే  నిర్ణయిస్తాడు. ఎలాగైతే తన అఖిల హేయ ప్రత్యనికత్వం (అన్నిచెడు గుణాలకు వ్యతిరేఖత్వం) మరియు కళ్యాణైకతానత్వం (సమస్త కాళ్యాణ గుణాలకు నిలయం) వంటి గుణాలను వేదం ఈ కళ్యాణ గుణాలను ఇతరమైన వాటి నుండి భేధపరచి కళ్యాణగుణాలను అనుకరిస్తుంది. (ఇతర ప్రమాణముల నుండి భేదపరుస్తుంది)

  • అపౌరుషేయత్వం – ఎవరి చేత కూడా సృష్ఠించబడింది కాదు. (ప్రతి సృష్ఠి యొక్క ఆరంభములో భగవానుడు వేదాన్ని బ్రహ్మకు ఉపదేశించును, అది క్రమంగా అలాగే ప్రచారం గావించబడును) కావున ఇంద్రియఙ్ఞానికి సంబంధించిన లోపాలకు తావు లేదు.
  • నిత్యం – శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. ఇది కాలాన్ని మరియు భగవానుని సర్వవేదఙ్ఞత్వం గురించి వెల్లడించును.
  • స్వత ప్రామాణ్యత్వం – అన్ని వేదాలు స్వయం ప్రపత్తి కలవి అనగా అన్నియు ఒకే విశ్వాసమును తెలుపును.

అపారమైన వేదసంపత్తును, వేదవ్యాసుడు భవిష్యమానవుల పరిమితమైన ఙ్ఞానాన్ని దృష్ఠిలో పెట్టుకొని ఆ వేదములను ఋక్, యజుర్, సామ మరియు అధర్వ వేదములుగా విభజించాడు.
వేదం యొక్క సారమే వేదాంతం. భగవానుని క్లిష్ఠతరమైన విషయాలను విశదీకరించు ఉపనిషత్తుల సమ్మేళనమే వేదాంతం. వేదం ఆరాధన ప్రక్రియను తెలుపును. వేదాంతం ఆ ఆరాధనకు యోగ్యుడైన వానిని తెలుపును. అలా చాలా ఉపనిషత్తులు ఉన్నప్పటికి కొన్ని మాత్రమే ప్రసిద్ధిగాంచినవి.  అవి

  • ఐతరేయ
  • బృహదారణ్యక
  •  చాంధోగ్య
  • ఈశ
  • కేన
  • కఠ
  • కౌశీతకి
  • మహానారాయణ
  • మాండూక్య
  • ముండక
  • ప్రశ్న
  • సుభాల
  • శ్వేతాశ్వేతర
  • తైత్తరీయ

వేదవ్యాసుడు రచించిన ఉపనిషత్తుల సారమును తెలుపు బ్రహ్మసూత్రములు కూడా వేదాంతముగానే పరిగణింపబడును. వేదం అనంతం. వేదాంతం చాలా సంక్లిష్ఠమైనది, కాని మానవుని ఙ్ఞానం మాత్రము పరమితమైనది (ఇది విపరీతార్థములను మరియు దోషములు చేయుటకు ఆస్కారభూతమైనది), కాని మనం ఈ వేద / వేదాంతములను స్మృతి, ఇతిహాసం (రామాయణ భారతాదులు) మరియు పురాణాల వల్ల  తెలుసుకోవచ్చు.

  • స్మృతి అనగా ధర్మశాస్త్రముల సంకలనం/కూర్పు.  మను, విష్ణు హారిత, యాఙ్ఞవల్క్యాది మహా ఋషుల చేత రచించబడినవి.
  • ఇతిహాసములనగా శ్రీ రామాయణ భారతాదులు. శ్రీ రామాయణం ‘శరణాగతి’ శాస్త్రంగా మరియు మహాభారతం ‘పంచమవేదం’ గా పరిగణింపబడుతున్నాయి (నాలుగు వేదాలు – ఋక్, యజుర్, సామ మరియు అధర్వ వేదములు).
  • 18 పురాణాలున్నవి (బ్రహ్మపురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం మొదలైనవి) మరియు బ్రహ్మచే చెప్పబడిన 18 ఉప పురాణాలు కూడ ఉన్నవి. బ్రహ్మ తనకు  సత్త్వగుణం ఉద్భవించినప్పుడు విష్ణు భగవానున్ని, రజో గుణం ఉద్భవించి నప్పుడు తనను, తమోగుణం ఉద్భవించి నప్పుడు శివుణ్ణి , అగ్నిని కీర్తించాడు.

ఇవన్ని ఉన్నప్పటికి మానవుడు శాస్త్రం ద్వారా ఙ్ఞానాన్వేషణ చేసి లక్ష్య సాధన చేయకుండా ప్రాపంచిక విషయాంతరముల యందు ఆసక్తిని ప్రదర్శిస్తాడు. వీరిని ఉద్ధరించుటకై భగవానుడు తానే స్వయంగా అవతరించాడు. అయినను ఈ మానవులు అతనిని నిందిస్తు చివరకు అతనితోనే యుద్ధంకూడా చేశారు. భగవానుడు  ఒక  జీవాత్మచే ఈ జీవులను ఉద్ధరించుటకై నిర్ణయించుకొని (వేటగాడు ఒక జింకను  ఎరవేసి ఇంకొక జింకను పట్టుకున్నట్లు) దోషరహిత ఙ్ఞానాన్ని అనుగ్రహించిన కొన్ని జీవాత్మలను అవతరింపచేసినాడు. వారే ఆళ్వార్లుగా (భగవద్భక్తిలో సదా నిమగ్నమై ఉండువారు) కీర్తింపబడుతున్నారు. వారిలో ప్రసిద్ధిగా ప్రపన్నజనకూటస్థులుగా నమ్మాళ్వార్ పరిగణింపబడుతున్నారు. మిగితావారు – పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిపొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్. అలాగే నమ్మాళ్వార్ శిష్యులగు మధురకవి ఆళ్వార్ మరియు పెరియాళ్వార్ కూతురగు శ్రీ ఆండాళ్ కూడ ఆళ్వారులుగానే పరిగణింపబడతారు. ఈ ఆళ్వార్లు భగవానునిచే కృప చేయబడ్డ దివ్య ఙ్ఞానముచే అనుభవించిన ఆ ఙ్ఞానమును లోపల ఇమడ్చుకోలేక మంగళాశాసన రూపమున కీర్తిస్తారు భగవానున్ని.

ఈ సంసార బంధముల నుండి జీవాత్మలను భగవానుడు ఉజ్జీవింపగోరి, నాథమునుల నుండి మణవాళ మాముణుల వరకు ఆచార్య పరంపరను ఏర్పరిచారు. ఆదిశేషుని అవతారముగా శ్రీభగవద్రామానుజులు ఈ ఆచార్య పరంపరలో మధ్యలో విరాజిల్లుతూ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని మరియు విశిష్ఠాద్వైతాన్ని శ్రీ పరాశర, వ్యాస, ద్రమిడ, టంక మొదలైన వారిననుసరించి ఏర్పరిచారు. అలాగే వారు 74 సింహాసనాథిపతులను  శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని నిరాంటకంగా ప్రచారం గావించాలని ఏర్పరిచారు. సంప్రదాయానికి వీరు చేసిన విశిష్ఠమైన కృషి మరియు సేవలను పురస్కరించుకొని ఈ సంప్రదాయం ‘శ్రీరామానుజ దర్శనం’ అని ప్రసిద్ధికెక్కినది.  మరళా వీరే మణవాళ మాముణులుగా పునరవతారంచెంది దివ్య ప్రబంధములను వ్యాఖ్యానించి ప్రచారం చేశారు. పెరియ కోయిళ్ శ్రీరంగమున పెరియ పెరుమాళ్  స్వయంగా శ్రీ మణవాళ మాముణులను తమ ఆచార్యులుగా  స్వీకరించి, తనతో ఆచార్య రత్నహారం ప్రారంభమగు నట్లుగా చేసిరి. మణవాళ మాముణుల తదుపరి ఈ సిద్ధాంతం వారి శిష్యులలో ప్రథానులగు పొన్నడిక్కాళ్ జీయర్తో ఆరంభమగు అ ష్ఠదిగ్గజములుగా ప్రసిద్ధి చెంది  ఆచార్య పురుషులచే ప్రచారం చేయబడింది. ఇలా ఎందరో ఆచార్య పురుషులు పూర్వాచార్య కృత ఈ రామానుజ దర్శనమును పరంపరగా ప్రచారం చేశారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

మూలము: https://granthams.koyil.org/2015/12/simple-guide-to-srivaishnavam-introduction/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

0 thoughts on “శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం”

Leave a Comment