శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తిరుమలకు బయలుదేరిన నాయనార్
ఉత్తర ప్రాంతాలలో ఉన్న తిరుమల మరియు ఇతర దివ్య దేశాలకు వెళ్లి అక్కడ ఎంబెరుమానులను సేవించుటకు యాత్ర ప్రారంభించాలని నాయనార్లు తమ దివ్య మనస్సులో సంకల్పించెను. వారు పెరియ పెరుమాళ్ళ సన్నిధి వెళ్లి, పెరుమాళ్ళను సేవించి, “అడియేన్ తిరుమలకు వెళ్లి తమ పాదాలను సేవించుటకు తమ అనుమతిని కోరుతున్నాను” అని అభ్యర్ధించెను. పెరుమాళ్ళు తమ దివ్య మాల, తీర్థ శఠారీలు వారిని సమర్పించి అనుమతిని అనుగ్రహించెను. “తదస్థేనాభ్య అనుంజ్ఞాతో యాతో దరణిం ఉత్తరాం” అని చెప్పినట్లు పెరుమాళ్ అనుమతిని పుచ్చుకొని వారు ఉత్తర భాగాలలో ఉన్న దివ్యదేశాల వైపు బయలుదేరెను.
తిరుక్కోవలూర్, తిరుక్కడిగై మంగళాశాసనము
అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు వెంటనే తిరుమలకు బయలుదేరెను. “ముప్పోదుం వానవరేత్తుం మునివర్గళ్” (దేవతలు నిత్యము తిరువేళ్లఱై పెరుమాళ్ళను సేవించుచుందురు) అని పెరియాళ్వార్లు చెప్పినట్లుగానే, వారు తిరువేళ్లఱై యందు పంగయచ్చెల్వి తాయార్ (శెంగమల వల్లి) యొక్క పురుషకారంతో సెందామరైక్కణ్ణన్ (పుండరీకాక్ష పెరుమాళ్) ను సెవించుకున్నారు. అక్కడి పెరుమాళ్ళ తీర్థ శఠారీలను అందుకొనెను. “పాదేయం పుండరీకాక్ష నామసంకీర్తనామృతం” (పుండరీకాక్షుని దివ్యనామాల జపం మనకు ఈ యాత్రలో అమృతం వంటిది) అని చెప్పినట్లు, వారు ద్వయ మహామంత్రాన్ని ధ్యానిస్తూ, “పూంగోవర్లూర్ తొళుదుం పోదు నెంజే” (ఓ నా మనసా! తిరుక్కోవలూర్ ఎంబెరుమానుని ధ్యానిస్తూ ఉండు) అని చెప్పినట్లు తిరుక్కోవలూర్ వైవు ప్రయాణము సాగించెను. మార్గ మధ్యంలో పలు చోట్ల విశ్రాంతి తీసుకుని తిరుక్కోవలూర్ చేరుకున్నారు. వారు మొదట ముద్దాలాళ్వార్ల దివ్య తిరువడిని సేవించి, వీరి సిఫార్సుతో త్రివిక్రమ ప్పెరుమాళ్ళను సేవించుకున్నారు. అతను తిరుమొళి పాశురము 2.10.9 “తూవడివిల్ పార్మగళ్” (సౌందర్య స్వరూపిణి భూదేవి) తో ప్రారంభించి, “తిరుక్కోవలూర్ అదనుళ్ కండేన్ నానే” (తిరుక్కోవలూర్ దివ్య దేశములో సేవించాను) తో ముగించారు. వారు ముదల్ తిరువందాది పాశురము 86 “నీయుం తిరుమగళుం నిన్ఱాయాల్” (శ్రీ మహాలక్ష్మి మరియు నీవు భక్తులపై కృపా వర్షాన్ని కురిపించడానికి కలిసి నిలబడి ఉన్నారు) పఠించారు. ఆ తర్వాత తిరుప్పావై పాశురము 24 “అన్ఱివ్వులగం అళందాయ్ అడి పోఱ్ఱి” (ముల్లోకాలను కొలిచిన నీ దివ్య పాదాలు చిరకాలం వర్ధిల్లాలి!) అంటూ తిరుక్కోవలూర్ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించెను. తిరుక్కోవలూర్ పెరుమాళ్ళు వెనక్కి లాగుతున్నట్లు, తిరువేంకటేశ్వరుడు తమవైపు లాగుతున్నారని తలచుకుంటూ వారు తిరుమలకి బయలుదేరారు. తిరువాయ్మొళి 3.3.8 పాశురములో చెప్పినట్లుగా “కున్ఱమేంది కుళిర్మళై కాత్తవన్ అన్ఱు జ్ఞాలం అళంద పిరాన్ పరన్ శెన్ఱు శేర్ తిరువేంగడం మామలై…” (గోవర్ధన గిరిని ఎత్తి గోవులను కాపాడినవాడు; ముల్లోకాలను తమ పాదాలతో కొలిచినవాడు; అటువంటి ఎంబెరుమానుడు వచ్చి ఈ తిరుమలలో కొలువై ఉన్నాడు…), పాశురము “తిరువేంగడత్తాయన్” (తిరుమల నివాసి) మరియు “మొయిత్త శోలై మోయ్ పూం తడం” (అనేక సరస్సులు తోటలతో ఉన్న), వారు అపారమైన గోష్టితో మరియు ఎంతో కోరికతో అతి సులభుడైన తిరువేంగడముడైయాన్ దివ్య పాదాలను సేవించాలని ఎంతో ఆతృతతో ముందుకు సాగారు. దారిలో, తిరుక్కడిగై (శోళింగపురం) కొండపైన కొలువై ఉన్న తక్కాన్ పెరుమాళ్ళను సేవించెను. శోళింగపురం సమీపంలోని ఎఱుంబి అనే ఊరికి చెందిన కొందరు ప్రముఖులు వారి కోసము కొన్ని పదార్థాలు తెచ్చి వారికి సమర్పించి సేవించు కొన్నారు. నాయనార్లు వారిపై తమ కృపను కురిపించి అక్కడ నుండి బయలుదేరారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/17/yathindhra-pravana-prabhavam-33-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org