యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 36

నాయనార్ శ్రీపెరుంబుదూరుకి బయలుదేరుట

అనంతరం, ఈ క్రింది శ్లోకములో చెప్ప బడినట్లు నాయనార్లు శ్రీపెరుంబుదూరుకి బయలుదేరారు.

యతీంద్రత్ జననీంప్రాప్య పురీం పురుషపుంగవః
అంతః కిమపి సంపశ్యన్నత్రాక్షీల్ల క్షమణం మునిం

(పామరోత్తముడైన అళగియ మణవాళర్, యతిరాజుల జన్మస్థలమైన శ్రీపెరంబుదూరుకి వెళ్ళి, ఆ ప్రదేశము వైశిష్ఠతను వీక్షించి ఎంతో సంతోషించి ఇళయాళ్వార్ (రామానుజ) ను దర్శించుకున్నారు). ఆ ఊరు ఎదుట నిలబడి ఆనంద అనుభూతిని అనుభవిస్తూ ఇలా అన్నారు…

ఇదువో పెరుంబుదూర్? ఇంగే పిఱందో
ఎతిరాశర్ ఎమ్మిడరై త్తీర్ త్తార్? – ఇదువోదాన్
తేంగుం పొరునల్ తిరునగరిక్కొప్పాన
ఓంగు పుగళుడైయ ఊర్

(ఇది శ్రీపెరుంబుదూరేనా? మన అవరోధాలను తొలగించేందుకు అవతరించిన యతిరాజుల ఊరా ఇది? తామ్రపర్ణి ఒడ్డున ఉన్న ఆళ్వార్ తిరునగరికి సమానమైన ప్రతిష్ఠ ఉన్నది ఈ చోటికే కదా!) వారు పట్టణ ప్రవేశం చేస్తూ మరో పాశురాన్ని పఠించారు.

ఎందై ఎతిరాశర్ ఎమ్మై ఎడుత్తళిక్క
వంద పెరుంబుదూరిల్ వందోమో! – శిందై
మరుళో? తెరుళో? మగిళ్ మాలై మార్బన్
అరుళో ఇప్పేఱ్ఱుక్కడి?

(మనల్ని ఆదుకోడానికి వచ్చిన మన స్వామి యతిరాజుల శ్రీ పెరుంబుదూరుకి చేరుకున్నామా? మన మనస్సు స్థిరంగా ఉందా లేదా  భ్రమిస్తోందా? మగిళమాలను తమ ఛాతీపై ధరించిన అతని (నమ్మాళ్వార్) కృపనా మనకు దక్కిన ఈ భాగ్యం [శ్రీ పెరుంబుదూరుకి వచ్చే]?) అసాధ్యమైన దివ్య లక్ష్యాన్ని సాధించాలని, మననము చేస్తూ ఆనందంతో పట్టణ ప్రవేశం చేసారు. ఇరామానుశ నూఱ్ఱందాదిలోని 31వ పాశురము పఠించారు. “ఆండుగళ్ నాళ్ తింగళాయ్ …. ఇరామానుశనై ప్పొరుందినమే” (ఓ మనసా! ఎంతో కాలంగా ఎన్నో జన్మలనెత్తి ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాము. కానీ, ఈ రోజు కాంచీపురంలో, దివ్య భుజములతో కొలువై ఉన్న దేవరాజ పెరుమాళ్ళ తిరువడి ఆశ్రయం పొందిన రామానుజులు మనతో ఉన్నారు) అని తమ చంచలమైన మనస్సుతో అన్నారు. శ్రీభాష్యం నేర్చుకోవడానికి అనుమతి కోరుతూ శ్రీపెరుంబుదూర్ ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రాత్రి వారి స్వప్నంలో ఎమ్పెరుమానార్లు వచ్చి, నాయనారుని పిలిచి, అతనికి శ్రీ భాష్యము బోధిస్తూ, “మేము మీకు పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం దేవ పెరుమాళ్ ఆలయం) లో శ్రీ భాష్యాన్ని నేర్పిస్తాము. కిడాంబి నాయనార్ వద్దకు వెళ్ళండి. మమ్మల్ని మరియు తిరువాయ్మొళి పిళ్ళైని సంతోష పెట్టడం కోసం నేర్చుకోండి, ఆపై ఆరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) వ్యాఖ్యానాల ప్రచారం చేస్తూ ఉండండి” అని ఆదేశించెను. ఎమ్పెరుమానార్ల సూచనలకు అనుగుణంగా, రామానుజులు రచించిన శ్రీ భాష్యాన్ని అధ్యయము చేయాలని ఎంతో శ్రద్ధతో కాంచీపురం పెరుమాళ్ కోయిల్‌కు చేరుకున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/21/yathindhra-pravana-prabhavam-37-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment