యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 52

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 51

ఎఱుంబి అప్పా తిరువారాధన పెరుమాళ్ అయిన చక్రవర్తిత్ తిరుమగన్ (శ్రీ రాముడు) అతని కలలోకి వచ్చి, “నీవు ఆదిశేషుని పునరవతారమైన మణవాళ మాముణుల పట్ల అపరాధము చేసావు. నీకు శ్రీ నారద భగవానుని మూలం తెలియదా? ‘భగవద్ భక్తి పాత్ర శిష్టోధనారాత్ కోపిదాసీ సుతోప్యాసి సమృతో వై నారాదోభగవత్ (ఒక వేశ్య పుత్రుడు భగవాన్ భక్తుని శేష ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరించాడు. మరు జన్మలో అతను నారద భగవానుడు అయ్యాడు). నీవు జీయర్ దివ్య తిరువడి యందు ఆశ్రయం పొంది, వారికి క్షమాపణలు చెప్పకపోతే, మీ తిరువారాధనను మేము స్వీకరించము. వెంటనే వెళ్ళు” అని ఆజ్ఞాపించాడు. అప్పా తమ నిద్ర నుండి మేల్కొని ఎటువంటి కల ఇది అని ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే కోయిల్ (శ్రీరంగం) కి బయలుదేరారు. ఈ శ్లోకం పఠించారు……

అంగేకవేరా కన్యాయాః తుంగేభువన మంగళే
రంగే ధామ్ని సుఖాసీనం వందే వరవరం మునిం

(కావేరి నడుమ సమస్త లోకాలకు మంగళకరమైన ప్రదేశంలా దర్శనమిచ్చే శ్రీ రంగ దివ్య దేశములో దయతో నివాసం ఉన్న మణవాళ మాముణుల దివ్య తిరువడి సంబంధం నేను పొందుతున్నాను). అదే సమయంలో, పెరుమాళ్ళను సేవించడానికి జీయర్ వస్తున్నారు. “దణ్డవత్ ప్రణమేత్ భూమావుపేధ్య గురుం అన్వహం” (ఒక కర్ర చేతిలో నుండి వదిలితే ఎలా నిఠారుగా క్రింద పడిపోతుందో అదే విధంగా ప్రతిదినం తమ ఆచార్యుడి ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి) అని చెప్పినట్లుగా, అప్పా జీయరుని చూసి వెంటనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. “లోచనాభ్యాం పిపన్నివా” (అతన్ని కళ్లతో కరిగించివేస్తూ) అని చెప్పినట్లుగా, జీయర్ తమ కరుణా భరితమైన దృష్ఠితో వారికేసి చూశారు. అప్పా జీయరు వారి దివ్య మంగళ స్వరూపం యొక్క సౌందర్య ఆస్వాదంలో మునిగిపోయి ‘మయిప్రవిశతి శ్రీమాన్’ నుండి ప్రారంభించి ‘మయిప్రసాదప్రవణం’ తో ముగిసే పూర్వదినచర్య పఠించడం ప్రారంభించారు.

ఆత్మలాభము కంటే గొప్పైనది మరేదీ లేదు అన్న భావించి, ఎఱుంబి అప్పాని స్వీకరించాలన్న సంకల్పంతో జీయర్ తిరిగి మఠానికి వచ్చారు. తమ శిష్యులతో “ఆలయానికి వెళ్లి, పెరుమాళ్ళను సేవించుకొని రండి” అని పంపారు. వాళ్ళు పెరుమాళ్ళను సేవించుకొని తిరిగి వచ్చాక వాళ్ళతో, పెరుమాళ్ ఫలానా అలంకారములు ధరించారని, ఫలానా ప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. ఆలయంలో తాము చూసినదంతా జీయర్‌ అక్షరాలా కళ్ళకు కట్టినట్లు వర్ణించడంతో, శిష్యులు వారి సర్వజ్ఞతను చూసి ఆశ్చర్యపోయారు. సుదూరం నుండి వచ్చిన అప్పా, శ్రీరంగాన్ని సేవించాలనే తమ కోరిక తీరేలా, ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారాన్ని చూస్తున్నట్లుగా, తదేకంగా వారు మాముణులను చూస్తూనే ఉండిపోయారు. దినచర్యలో చెప్పినట్లు – “భవంతమేవ నీరంత్రం పశ్యన్వస్యేన చేతసా” (అడియేన్ మీ ఉత్తమ ఛాయలో ఉంటూ మీ ఔన్నత్యాన్ని చూస్తూనే ఉంటాను), అని జీయర్ దివ్య మంగళ స్వరూపాన్ని తన ధారకం, పోషకం, భోగ్యంగా భావించారు.

మరుసటి రోజు తెల్లవారుజామున, అణ్ణన్ తో ఇతర శిష్యులు కలిసి జీయర్ గది ద్వారం వద్ద నిలుచొని, వారిని మేల్కొలపడానికి ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

రవిరుధయత్యతాపి నవినశ్యతిమేతిమిరం
వికసతి పంకజం హృదయపంకజమేవ నమ
వరవర యోగివర్య! వరణీయ గుణైకనిధే!
జయజయదేవ! జాగ్రహి జనేషు నిధేహి దృశం

(సూర్యుడు ఉదయించినా అడియేన్ మనస్సులోని చీకటి తొలగలేదు. సరస్సులలో తామరపూలు వికసించాయి కానీ అడియేనుడి హృదయ కమలం వికసించలేదు. దివ్య మంగళ గుణాలకు నిధి అయిన ఓ స్వామీ! ఓ మణవాళ మాముని! దేవరి వారు మేల్కోవాలి. దేవరి వారి దివ్య నేత్రాలు తెరవాలి. తమ ఆశ్రయం పొందిన వారిపై కరుణ కురిపించాలి. మాముణులు లేచి, గురుపరంపరతో ప్రారంభించి రహస్య త్రయం (తిరు మంత్రం, ద్వయం, చరమ శ్లోకం) పఠించారు. వారు తిరుమంత్రం ద్వారా ఎంబెరుమానుని పర, వ్యూహ, అంతర్యామి గుణాలను, చరమ శ్లోకం ద్వారా విభవ గుణాలను, ద్వయం ద్వారా అర్చా (విగ్రహ రూపం) గుణాలలోని సంపూర్ణతను కరుణతో పఠించారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/05/yathindhra-pravana-prabhavam-52-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment