యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 88

జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్

మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ ఆ రోజు, మరుసటి రోజు అక్కడే గడిపి, రెండవ రోజు అర్ధ రాత్రిలో, ఈ పాశురములో చెప్పినట్లు

మణికాంచన సంజన్నాం చిపికాం తద్ అతిష్టితాం
అస్పన్నయంత స్వస్గందే కృత్వా కేచిత్ ప్రతస్థిరే

(మణవాల మాముణులు కరుణతో ఆసీనులై ఉన్న ఆ కెంపులతో పొదగబడిన స్వర్ణ పల్లకిని కొందరు శ్రీవైష్ణవులు అలుపు లేకుండా తమ భుజాలపైన మోసుకువెళ్ళారు) ఆ రాజు సమర్పించిన నవరత్నాభరితమైన అమూల్య పల్లకీలో బయలుదేరారు. చల్లని మంచు కురుస్తున్న రాత్రి అయినందున, ఆ పల్లకీని కప్పి శ్రీవైష్ణవులు మోసుకెళ్లారు. క్రింది శ్లోకములో పేర్కొనబడి ఉంది..

చత్రంచిత్రం తదుః కేచిత్ చామరే తదిరేపరే
బ్రుంగారమవరే’బిప్రన్ కళాఙ్ఞమపికేచన
తద్ పాదబ్జ రజస్పర్శ పావనీం ఆత్మ భావినీం
సంతస్సంతారయంతిస్మ మౌళినామణి పాదుకాం
అకాయన్నగ్రతః కేచితత నృన్యంతి కేచన

((శ్రీవైష్ణవులలో) కొందరు వైభవపూర్ణమైన స్వేత గొడుగును పట్టుకున్నారు; కొందరు చామరను ఊపుతున్నారు; కొందరు పడిక్కం (విగ్రహాల స్నానం కొంసం ఉపయోగించే నీటి బిందెలు/పాత్రలు) మోసుకెళుతున్నారు, కొందరు కళంజి (తమలపాకులు, వక్కలు పెట్టుకునే పాత్ర); మరికొందరు జీయర్ పాదుకలు పట్టుకెళుతున్నారు. ఎందుకంటే వారి దివ్య పాద ధూళి వాటిపై పడి పవిత్రం చేస్తుంది కాబట్టి; కొందరు ముందుకు సాగారు (వెనక వచ్చేవారి సౌకర్యార్థం); మరికొందరు నృత్యం చేశారు), జీయర్ ఆసీనులైన దివ్య పల్లకిని మోసుకెళుతూ, అనేక శ్రీవైష్ణవులు తమకు అనుగుణమైన కైంకర్యాన్ని – దివ్య ఛత్ర చామరలు మొదలైన వివిధ ఉపకరణాలను పట్టుకొని పరమానందంతో పాడుతూ నృత్యం చేస్తూ, మరికొందరు ఆనందంగా వింటూ ముందుకు సాగారు. ఇలా వాళ్ళు దాదాపు 20 మైళ్ళు వెళ్ళిన తరువాత, తెల్లవారింది. వైగై నది ఒడ్డున నిత్యానుష్టానము నిర్వహించేదుకు ఆగారు. పల్లకీ మోసేవానిగా వేషం ధరించిన రాజు, జీయర్ పాదాలను సేవించుట గమనించిన జీయర్ ఆశ్చర్యపోయి, “నీవిలా చేయవచ్చా?” అని అడిగారు. వాళ్ళు అప్పుడు చేరుకున్న కుగ్రామం ‘ముత్తరసన్’ పై తమ కృపను కురిపించమని రాజు జీయర్‌ ను వేడుకున్నారు. జీయర్ ఆ గ్రామాన్ని ఆశీర్వదించి, వారి విన్నపం మేరకు ఆ గ్రామానికి “అళగియ మణవాళ నల్లూర్” అనే నామాన్ని పెట్టారు. ఆ తర్వాత రాజుకి వెళ్ళమని అనుమతినిచ్చి, వీళ్ళందరూ తిరుప్పుళ్ళాణి మీదుగా ముందుకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు చోటు వెతుకుతున్నారు. మంచి నీడనిచ్చే ఒక చింత చెట్టును చూశారు. వారంతా ఆగి ఆ చెట్టు నీడలో తమ అలసటను తీర్చుకున్నారు.

చింతచెట్టుకి మోక్షాన్ని ప్రసాదించిన జీయర్

జీయర్ శిష్యులు ఒక చింతచెట్టు తమందరికీ ఎంతో మేలు చేసిందని, ఆ చెట్టుపై తమ కరుణను కురిపించమని అభ్యర్థించారు. జీయర్ అద్భుతమైన దయతో, తమ దివ్య హస్తాలతో ఆ చెట్టును తాకి, “నేను పొందిన ఫలాన్నే నీవు పొందుగాక” అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ చెట్టు వెంటనే తాజాదనం కోల్పోయి వ్రాలి కనుమరుగై పోయింది. అది చూసి శిష్యులు ఇలా అన్నారు..

యంయం స్పృశతి పాణిభ్యాం యంయం పశ్యతి చక్షుషా
స్థావరాణ్యపి ముచ్యంతే కింపునర్ బాంధవాజనాః

(పరమ సాత్వికులెవరైనా తమ దివ్య హస్తాలతో తాకినా, వారి దృష్థి పడినా, చెట్లు అయినా సరే, మోక్షాన్ని పొందుతుంది; అలాంటప్పుడు, జీయర్ తిరువడి సంబంధము ఉన్న వారి గురించి వేరే చెప్పాలా?).

అనంతరం జీయర్ బృందం తిరుప్పుల్లాణి చేరుకుని, తిరుప్పుల్లాణి పెరుమాళ్ళను దర్శించుకొని, అక్కడి నుండి బయలుదేరి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ తిరునగరి చేరుకున్నారు. అందరు శాస్త్ర విధిని అనుసరించి ‘ఆళ్వార్’ ను, ‘పోలిందు నిన్ఱ పిరాన్ (తిరునగరి పెరుమాళ్ళ తిరునామము) ని దర్శించుకొని మంగళాశాసనం చేసారు. అక్కడ అనేక మందిని సంస్కరించి, తిరుమగళ్ కేళ్వన్ (శ్రీమహాలక్ష్మికి పతి) దాసులుగా మార్చారు. వాళ్ళకి తిరువాయ్మొళి వంటి దివ్యప్రబంధాలను ఉపదేశించి, వారు నిత్యం ఆళ్వార్ తిరుమంజనం, ఇతర దివ్య ఉత్సవాలను అనుభవించారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/15/yathindhra-pravana-prabhavam-89-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment