యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 61

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 60

శ్రీవైష్ణవుల గుణాలను వివరిస్తున్నారు

ఉత్తర దక్షిణ భారత దేశపు ప్రాంతాల వారు తరచూ దర్శించుకునే శ్రీరంగ దివ్య క్షేత్రం పెరుమాళ్ళ దివ్య నివాసము. ఉత్తర దేశపు ఒక శ్రీవైష్ణవ ప్రభు (ఒక శ్రీవైష్ణవ శ్రీమంతుడు) జీయర్ ఉక్త్యానుష్టానాముల (అనుష్టానాలు, ఉపన్యాసాలు) గురించి విని, తమ దేశం నుండి శ్రీరంగాన్ని వెళుతున్న కొందరు భక్తుల ద్వారా జీయరుకి సందేశం పంపారు. ఆ సందేశంలో “కృపచేసి ఆచరణలో అనుసరించగలిగే అన్ని శాస్త్రార్థాలను క్లుప్తంగా ఇమిడ్చి, దయతో అడియేనుకి పంపండి” అని అభ్యర్థించారు. జీయర్ తమ సందేశంలో ఆ శ్రీవైష్ణవ శ్రీమంతుడికి ఇలా జవాబిచ్చారు. “పెరుమాళ్ళను సేవించుటలో ఉన్న రుచిని పురుషార్థం అని తెలుకున్న వ్యక్తికి కేవలం ఆతడికి సేవ చేయడమే పురుషార్థం కాదు. ఒక వ్యక్తి తన భుజాలపై శంఖ చక్ర చిహ్నాలు ధరించున్నంత మాత్రాన సరిపోదు, కేవలం పెరుమాళ్ళను సేవించుటయే సరిపోదు. కేవలం ఆచార్యునిపై పూర్ణంగా ఆధారపడే అర్హత ఉంటే సరిపోదు. కేవలం భాగవతాలకు పరతంత్రుడై ఉంటే సరిపోదు. అలాంటప్పుడు, ఆ వ్యక్తి పురుషార్థాన్ని ఎలా పొందగలడు? శ్రీవైష్ణవులు తన ఇంటిలోకి ఎటువంటి సంశయం లేకుండా ప్రవేశించేలా ఉండాలి. వారికి సరైన కైంకర్యం చేస్తూ, వారికి అన్ని సదుపాయాలను అందించి, ఉండడానికి అనుమతించి, ఎంతగా అంటే “వారు నన్ను కూడా అమ్మవచ్చు” అనే విధంగా ఉండి పురుషార్థాన్ని సాధించగలరు. ఒక మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఊడలన్ని ఉన్నట్లే, ప్రణవంలో ఎన్ని అక్షరాలు ఉన్నట్లే, భాగవత శేషత్వం చివరి వరకు అనుసరిస్తే, సత్సాంప్రదాయ అర్థాలన్ని వచ్చినట్లే. మరో మాటలో చెప్పాలంటే, చరమార్థము (పూర్తిగా భాగవత పరతంత్రులై ఉండుట) ను పాటించే వారికి, భగవత్ సంబంధిత రహస్య అర్థాలను విడమరచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేశ్య పతివ్రత ధర్మాన్ని గురించి మాట్లాడినట్లే, ఈ విశిష్టమైన అర్థాన్ని పాటించపోతే, సాంప్రదాయ అనుష్టానములు వ్యర్థం అవుతాయి.

పూజానాత్ విష్ణు భక్తానాం పురుషార్థోస్థి నేతర
తేషు విద్వేషతః కించిత్ నాస్తి నాశకం ఆత్మనాం

(భగవాన్ పట్ల పూర్ణ సమర్పణతో ఉన్న శ్రీవైష్ణవులను సేవించుట కంటే గొప్ప పురుషార్థం మరొకటి లేదు. వీరి పట్ల ద్వేషం, ఆత్మ స్వరూపాన్ని నాశనం చేసే మరొక చర్య ఉండదు)” అని జీయర్ తిరుమంత్ర సారమైన చరమార్థ నిష్ట (పురుషార్థ సాధనలో దృఢ నిష్చయుడై ఉండటం) ను తమ దివ్య సూక్తుల ద్వారా వివరించారు.

జీయర్ నుండి శ్రీముఖం (సందేశం) ను అందుకున్న తరువాత, ఆ శ్రీవైష్ణవ ప్రభు భాగవత ఆరాధనలో లీనమై ఉన్నారు; “తస్యై నిత్యం ప్రతిశద్ధిశే దక్షిణస్యై నమస్యం” (దక్షిణ దిక్కుని నిత్యం నమస్కరించుము), “దిశేవాపి నమస్కృర్యాత్ యత్రాసౌ వసతి స్వయం” (కనీసం తమ ఆచార్యుడు ఉంటున్న ఆ దిశకు అంజలి సమర్పించాలి) అని చేప్పినట్లు. తిరువాయ్మొళి 6-5-5 పాశురం ప్రకారం “తొళుం అత్తిషై ఉఱ్ఱు నోక్కియే” (ఆ దిశ వైపు తదేకంగా చూస్తూ సేవించు) అని చేప్పినట్లు, ప్రతిరోజూ నిద్రలేచిన వెంటనే, మాముణులు ఉండే దక్షిణ దిశకు అంజలి సమర్పించేవారు. తమ వర్ణానికి అనుగుణంగా జీయర్ మఠానికి సేవలు అందించేవారు.

ఆ సమయంలో, భట్టర్ పెరుమాళ్ (కురత్తాళ్వాన్ వంశస్థుడు) పెరుమాళ్ సన్నిధిలో జీయరుకి సాష్టాంగము చేసి “మీ శిష్యులు మాకు సాష్టాంగ ప్రణామం చేయడం లేదు, మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు” అని ఫిర్యాదు చేశారు. జీయర్ మఠం చేరుకొని, శిష్యులను పిలిచి, కారణమేమిటో అడిగారు. “వారికి పరతంత్రులై ఉండుట తమకు ఇష్టం లేదు” అని వారి శిష్యులు అన్నారు. “అలా అయితే పెరుమాళ్ పిరాట్టి దివ్య సింహాసనంలో కూర్చొని ఉన్నారని కల్పన చేసుకొని సేవించండి” అని జీయర్ వారితో అంటారు. ఆ విధంగా, పెరుమాళ్ళ పట్ల పరమ భక్తి ఉన్న జీయర్, దోషాలు ఉన్న చోట కూడా శుభ గుణాలను వెతకగలిగేవారు; సరైన అనుష్టానము ఎరిగిన వారు కాబట్టి, మన పూర్వాచార్యులు ఆచరించిన అనుష్టానాలకు తగిన విధంగా గౌరవాలు అందించేవారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/16/yathindhra-pravana-prabhavam-61-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment