యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 53

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 52

అనంతరము, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా …

అయంపున స్వయంవ్యక్త అనవతారాన్ అనుత్తమాం
నిధాయ హృదినీరంతరం నిధ్యాయన్ ప్రతభుద్యత
విశేషేణే సిషేవేచ శేషభోగ విభూషణం
అమేయమాత్ ఇమంధానం రమేశం రంగశాయినం
ధ్యానం ధ్యానం వపుస్తస్య పాయం పాయం దయోదతిం
కాయం కాయం గుణానుచ్చైః సోయం తద్భూయసాన్వభూత్

(స్వయంవ్యక్త స్వరూపాలైన అర్చావతారములను మణవాళ మాముణులు ధ్యానం చేస్తూ తమ దివ్య నేత్రాలను తెరిచారు. ఆదిశేషునిపై దివ్య అలంకారభూషితుడై శ్రీరంగంలో శయనించి ఉన్న దివ్య తేజోమయుడైన శ్రీయఃపతిని పూర్తిగా ధ్యానించారు. ఆ శ్రీరంగనాధుని దివ్య స్వరూపాన్ని, సాగరంలా ఉన్న ఆతడి కరుణను, మంగళ గుణాలను ధ్యానిస్తూ, మాముణులు పదే పదే ఆతడి దివ్య ప్రకాశాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు), సమస్థ అర్చా మూర్తులకు మూలమైన పెరియ పెరుమాళ్ళ విగ్రహ స్వరూపాన్ని, గుణాలను ధ్యానించారు. వారు యతీంద్రుల (రామానుజులు) తిరువడి భక్తిలో మునిగి స్నానం చేసారు. సర్వేశ్వరుని పట్ల భక్తికి, యతీంద్రుల పట్ల ఉన్న భక్తి ప్రపత్తులు సరిహద్దు రేఖ వంటిదని చెప్పబడింది. తమ స్నానం తర్వాత, నిత్యానుష్టానం, ఊర్ధ్వపుండ్రములను ధరించి, పారతంత్రియానికి నిదర్శనంగా తమ తిరువారాధాన పెరుమాళ్ళు శ్రీ రంగనాధునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది.

ఆత్మస్వరూప యాతాత్మ్యం ఆచార్యధీన దైవయత్
ఆమ్నాయానాం రహస్యంత తకిలేభ్యః ప్రకాశయన్
సర్వం యతిపదేరేవ కుర్వన్నాదేశ పూర్వకం
కృత్యాకృత్యేషు కర్తృత్వం కృతీకిమపి నస్పృశన్
తదస్తస్య ముఖోల్లాసం చికీర్షన్నేవ కేవలం

(మణవాళ మాముణులు తమ కర్మను ఆచరిస్తున్నానని ఎటువంటి ఆలోచన లేకుండా, యతీంద్రుల శ్రీముఖంలో ఆనంద భావాన్ని ఆశించి తమ కార్యాన్ని సాగించారు, [మరో మాటలో చెప్పాలంటే, చేసే కార్యముపై కర్తృత్వ భావము లేకుండా]; ఇది వారి ఆచార్య పారతంత్ర్యం (తమ ఆచార్యునిపై పూర్తిగా ఆధారపడి ఉండటం) గుణాన్ని వ్యక్తపరుస్తుంది. ఇది నిజమైన ఆత్మస్వరూప లక్షణం, వేదాలలో పరిపూర్ణంగా పేర్కొనబడింది.

అనంతరం వారు సన్నిధిస్తంభమూలభూషణం (సన్నిధిలోని స్థంభానికి దగ్గరగా ఆసీనులై ఆ చోటిని అలంకరించడం) లా తిరుమలైయాళ్వార్ [ఉపన్యాస మండపం]లోకి ప్రవేశించారు.

కందాడై అణ్ణన్ పురుషకారంతో ఎఱుంబి అప్పా మాముణులకు తమ కోరికను ఇలా వ్యక్తం చేశారు, “దయచేసి దేవరి వారి పాదాల యందు అడియేనుకి ఆశ్రయం ఇవ్వండి” అని విన్నపించారు. మాముణులు అతని కోరికను అంగీకరించి, వారికి పంచసంస్కారములను అనుగ్రహించి, మాముణులు తమ దివ్య తిరువడిని అప్పా శిరస్సుపై అలంకరించి, తమ విశిష్ట కృపను వారిపైన కురిపించారు. ఎఱుంబి అప్పాకు మంగళాశాసనమౌతుందని తమ మనస్సులో సంకల్పించుకుని, అతనికి మంత్రరత్నం (ద్వయం) వివరించి, తమ ఆంతరంగకుడిగా చేసుకుని, పెరుమాళ్లకు మంగళాశాసనం చేసేందుకు ఆలయానికి వెళ్లారు. నాన్ముగన్ తిరుక్కోపురం ముందు సాష్టాంగం చేసి, ఈ శ్లోకంలో పేర్కొన్న క్రమంలో సన్నిధిలను సేవిస్తూ ఆలయంలోకి ప్రవేశించారు.

దేవీగోదా యతిపతి శటద్వేషిణౌ రంగశృంగం
సేనానాథో విహగవృషబః శ్రీనిధిః సింధు కన్యాః
భూమానీళా గురుజనవృతః పురుషశ్చేత్యమీషాం
అగ్రేనిత్యం వరవరమునేరంగ్రియుగ్మం ప్రపద్యే

(ఆండాళ్, ఎంబెరుమానార్, నమ్మాళ్వార్, శ్రీరంగ విమానం, విష్వక్సేనులు, గరుడ, శ్రీ రంగనాధుడు, శ్రీ రంగ నాచ్చియార్, భూమి దేవి, నీళా దేవి, ఆళ్వార్లు చుట్టూ వ్యాపించి ఉన్న పరమపదనాధునికి మంగళాశాసనాన్ని నిర్వహించే మణవాళ మాముణుల దివ్య పాదాలను నేను నిత్యం ఆరాధిస్తాను), ప్రతి సన్నిధిలో తగిన పద్దతిలో మంగళాశాసనాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పెరియ పెరుమాళ్ మరియు నంపెరుమాళ్ళ తిరువడిని సేవించారు. అనంతరం, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా….

ఉపేత్య పునరప్యేష నిజమేవ నివేశనం
నివేధ్య నిఖిలం తత్ర యతీంద్రాయ నమస్యయా

(మణవాళ మాముణులు తమ మఠానికి తిరిగి వచ్చి అక్కడ జరిగిన సంఘటనలను తమ వద్ద నివాసముంటున్న యతిరాజులకు (రామానుజులు) తెలియజేసారు), వారు తమ మఠానికి తిరిగి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటనలను రామానుజులకు వివరించారు. ఆ తర్వాత రామానుజుల తిరువడి దివ్య నీడగా తిరుమలయాళ్వార్ (ఉపన్యాస మండపం) లోకి ప్రవేశించి, ఈ సంసార విముక్తులను చేసే తమ పాద స్పర్శ కలిగిన పరిమళ తీర్థం – శ్రీ పాదతీర్థాన్ని ఎఱుంబి అప్పకి ప్రసాదించారు.

పెరుమాళ్ళకు సమర్పించిన నైవేద్యాలను తరువాత మాముణులు కూడా స్వీకరించారు, ఈ శ్లోకంలో వివరించబడింది…

అత మాధ్యానికం కృత్యం కృత్వా సర్వోత్తరం మునిః
ఆరాధ్య విధివత్ దేవమన్వభూత్ రంగభూషణం
తతస్సం ముఖసంస్పర్శరసేన సుగంధినా
శుచినా సుకుమారేణ సత్వసం శుద్ధి హేతునా
భక్తి భూతం ప్రభూతేన భోజ్యేన భగవత్ ప్రియాన్
తత్ పరః తర్పయామాస తధీయప్రేమ వృత్తయే
ఆత్మానం ఆత్మనాపశ్యన్ భోక్తారం పురుషమ్భరం
అనుయాగం యథాయోగం నిస్సంగో నిరవర్తయన్

(తరువాత, పరమ సాత్వికులైన మణవాళ మాముణులు, తమ మధ్యాహ్నిక అనుష్టానం నిర్వహించి, సరైన విధితో తమ తిరువారాధన పెరుమాళ్ అయిన శ్రీ అరంగనగరప్పన్ కు తిరువారాధనం చేశారు. ఎంబెరుమానుని దివ్య గుణాలను ధ్యానించారు. భగవానుని దివ్య అదర స్పర్శతో అమృతంలా, సువాసనతో పవిత్రమై, మృదువుగా మారి, సత్వ గుణాన్ని, మనః శుద్దిని కలిగించే ప్రసాదాన్ని భగవత్ భక్తులకు సమృద్ధిగా సమర్పించి, ఆ తరువాత తాను కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి, తమ ద్వారా భోక్త స్వరుపంలో ఉన్న తన అంతర్యామి భగవానునికి అందించారు. తొండరడిప్పొడి ఆళ్వారి పాశురములో “పోనగం శెయ్ద తరువరేల్ పునిదమన్ఱే”- (భాగవతాలకు సమర్పించిన ప్రసాద శేషం పవిత్రమైనది) అని చెప్పబడింది. అప్పా పెరుమాళ్ళకు సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించి వారు సంతృప్తి చెందారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/06/yathindhra-pravana-prabhavam-53-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment