శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – ఆరణ్య కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

<< అయోధ్యా కాండం

దండకారణ్యం చేరిన తర్వాత, అక్కడ నివసించే ఋషులు వచ్చి శ్రీరాముడు, సీతా అమ్మవారు మరియు లక్ష్మణులను కలిసారు. శ్రీరాముడు వారి సమస్యలను విని, వారికి రాక్షసుల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని. వారిని రక్షిస్తాను అని ప్రమాణం చేశారు. దండకారణ్యం లో ప్రయాణిస్తూ, సీతా అమ్మవారిని అపహరించే ప్రయత్నం చేసిన విరాధ అను రాక్షసుణ్ణి సంహరించి సీతమ్మవారిని రక్షించారు.

అక్కడనుండి వారు శరభంగ ముని ఆశ్రమం చేరి వారి ఆశీసులను పొందారు. అక్కడ ఉన్న ఋషుల కష్టాలు విని వారిని ఓదార్చారు. అటుపైన సుతీక్షణ ముని ఆశ్రమం చేరి వారి అనుగ్రహాన్ని పొందారు. అటుపిమ్మట అగస్త్య మునిని కలిసి వారినుండి విశిష్ఠమైన ధనుస్సుని స్వీకరించి, వారి సూచన ఆధారంగా, పంచవటి వైపు ప్రయాణించారు.

మార్గంలో, వారు జటాయు మహారాజుని కలిశారు. తన ప్రియమిత్రుడు, దశరథుని కుమారుడు అయిన శ్రీరామునికి సహాయపడుతాను అని జటాయువు మాటిచ్చిరు. శ్రీరాముడు కూడా జటాయువుని గొప్పగా కీర్తించి వారి ఆశీర్వాదాలను స్వీకరించారు.

పంచవటి చేరిన తర్వాత, లక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు, వారు అక్కడ వుండసాగారు. రావణుని సహోదరి అయిన శూర్పణఖ అక్కడికి వచ్చింది. తను ఒక్క రాక్షసి అయినప్పటికీ శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని చూసి మోహించింది. తాను వెంటనే శ్రీ రాముణ్ణి పొందాలి అని నేరుగా శ్రీరాముడి దగ్గరికి వెళ్లి కోరికని వ్యక్తపరిచింది. కానీ తనకు వివాహం అయ్యింది అని నిరాకరించారు. అలానే లక్ష్మణుడు ఒక్కడే ఉండటం చేత వారిని అడగమని సూచించారు. తను వెంటనే లక్ష్మణుడిని వద్దకు పోగా, తానే శ్రీ రామ దాసుడిని స్వీకరించలేను అని నిరాకరించారు. శూర్పణఖ వెంటనే సీతమ్మవారిని అడ్డుగా భావించి, వారిపై దాడి చేసింది, అప్పుడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులను కత్తితో కోసివేశారు. తాను అక్కడనుండి పరిగెత్తి ఖర-దూషణాదులతో జరిగినది వివరించగా వారు 14000 మంది రాక్షసులతో యుద్ధానికి వస్తే శ్రీరాముడు ఒక్కడే వారిని సంహరించగా, శూర్పణఖ అక్కడనుండి లంకకు వెళ్లి రావణుడికి జరిగింది తెలిపింది. విన్న తరువాత, ఆమె సూచన ప్రకారం, రావణుడు సీతమ్మను అపహరించే ఉపాయం వేశాడు. తన మామ మారీచుడిని మాయలేడి గా మారి శ్రీరాముని ఆశ్రమం వద్ద తిరగమని కోరగా. మారీచుడు, తాను మొదట నిరాకరించినప్పటికీ, చివరకు చెప్పిన విధంగా వెళ్ళాడు. సీతమ్మవారికి, మాయలేడి పట్ల ఆశ కలిగి, శ్రీరాముడిని దాన్ని చెర చేసి పట్టుకురమ్మని కోరారు.

లక్ష్మణుడు, జింక చూడటానికి సందేహజనకముగా ఉందని, రామున్ని నివారించారు; అప్పటికీ శ్రీరాముడు దాన్ని వెంబడించారు. కాసేపటికి దాన్ని వేటాడి, పడగొట్టగా, ఆ సమయం లో మారీచుడు “సీత! లక్ష్మణా!” అని అరిచాడు. అది విన్న సీతాపిరట్టి లక్ష్మణుడిని వెళ్ళి శ్రీరాముడికి సహాయం చెయ్యమనగా, వేరే దారి లేక లక్ష్మణుడు శ్రీ రాముడిని వెతుకుతూ వెళ్లారు. ఆ సమయంలో, రావణుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి, సీతా పిరట్టిని అపహరించాడు. రావణుడు ఆకాశమార్గం లో తీసుకుని వెళ్తుండగా, పిరాట్టి సహాయం కొరకు కేకలు పెట్టగా, జటాయు మహారాజు సహాయం చెయ్యటానికి వచ్చి, రావణుడితో యుద్ధం చేశారు. కానీ రావణుడు జటాయువు యొక్క రెక్కలు నరికివేసి, క్రిందకి పడివేశాడు. తరువాత ఆమెను లంకలోని అశోకవనంలో ఉంచాడు.

ఇక్కడ, శ్రీ రాముడు మరియు లక్ష్మణుడు ఒకరినొకరు కలుసుకుని జరిగినది అర్థం చేసుకుని, ఆశ్రమం చేరి, సీతమ్మ కోసం అన్ని దిక్కులు వెతకి, శ్రీ రాముడు కలత చెందారు. వారు జటాయు మహారాజుని స్థితి చూసి బాధపడి. తాను జటాయువుకి మోక్షం ఇచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.

దారిలో, కబంధుడు శ్రీ రాముడు మరియు లక్ష్మణుడిని బంధించాడు. అతను శాపగ్రస్తుడు అని తెలిసి రాముడు శాప మోచనం కలిగించగా, కబంధుడు వారిని వెళ్లి సుగ్రీవుడిని కలవమని ప్రార్థించాడు.

దారిలో, శ్రీ రాముడు మతంగ ముని ఆశ్రమం చేరి వారి కోసం ఎదురుచూస్తున్న శబరిని అనుగ్రహించారు. ఆమె ఎంపిక చేసిన శ్రేష్ఠమైన పండ్లు తాను స్వీకరించి, మోక్షం అనుగ్రహించారు. తను నిర్దేశించిన విధముగా, వారు పంపా సరోవర తీరానికి చేరారు.

సారం

  • దండకారణ్యం లోని ఋషులను చూసి, శ్రీరాముడు ఖిన్నుడు అయ్యాడు. తాను ఆలస్యం చేసినందుకు క్షమించమని కోరాడు. సీతా అమ్మవారు ప్రోద్బలంతో త్వరగా రాక్షసులను సంహరించి వారికి ఆనందం కలగచేశాడు.
  • శూర్పణక, శ్రీరాముడిని పొందకొరింది. కానీ సీతా అమ్మవారిని చంపి పొందాలి అని అనుకుంది- తన క్రూరత్వం యిట్టిది. కావునా తన చెవులు ముక్కు కోలిపోయింది.
  • శ్రీరాముడు ఒంటరిగా 14000 వేల మంది ఖర-దూషణాది రాక్షసులను నేల కూర్చాక. సీతా అమ్మవారు, అతి ప్రసన్నురాలు అయ్యి, యుద్ధములో కలిగిన గాయాలను తొలిగే విధముగా ఆలింగనం చేసుకుంది.
  • మారీచుడికి శ్రీరాముడి బాణం దెబ్బ వల్ల శ్రీరాముడు అంటే భయం ఉన్నప్పటికీ. తాను సహాయం చెయ్యకపోతే, రావణుడి చేతిలో చనిపోతాను అని గ్రహించాడు. కావునా తను శ్రీరాముడి చేతిలో మరణం పొందటం మేలు అని తలచి, మాయా లేడిగా వెళ్ళాడు.
  • శ్రీరాముడు ప్రక్కన ఉన్నప్పటికీ మాయాలేడిని కోరిన కారణం చేత, తాను శ్రీరాముడి సహవాసం కోలిపోయింది. అది వారి లీల అయినప్పటికీ, ఈ సన్నివేశం ద్వారా మనం నేర్చికోవాల్సింది, భగవానుడిని తప్ప ఇతరమైనవి కోరుకోవద్దు అని. అలానే, పిరట్టి లక్ష్మణుడితో పరుషముగా మాట్లాడింది. అది కూడా వారికి కష్టాలను తెచ్చిపెట్టింది. అది లీల అయినప్పటికీ, భాగవతాపచారం యొక్క దుష్పరిణామం చూపుతుంది.
  • రావణుడు పిరట్టిని అపహరించాడు అని చెప్పటం అవివేకం. గమనిస్తే, నిజానికి సీతా అమ్మవారు, స్వయంగా లంకకు, దేవతా స్త్రీలను రావణుడి చెర నుండి కాపాడటానికి వెళ్లారు. తాను వెళ్తే మాత్రమే, శ్రీరాముడు తన కోసం లంకను నాశనం చేసి వారిని రక్షిస్తాడు అని భావించింది.
  • మనం శ్రీరాముడు, అమ్మవారి నుండి వేరు పడటం వల్ల పొందిన విరహా తాపం చూసి, ఈ సంసారం యొక్క క్రూర స్వభావం అర్థం చేసుకోవాలి. ఒకవేళ భగవానుడే స్వయముగా ఇక్కడ అవతరించినా, ఇక్కడి దుఃఖాలను అనుభవించారు. కావున, భగవంతుడి మరియు ఆచార్య కృప చేత ఇక్కడ నుండి మోక్షం పొంది, నిత్య కైంకర్యంలో నిమగ్నమవ్వండి.
  • శబరి ఫలం సమర్పించే ఘట్టంలో, కొందరు తాను వాటిని రుచి చూసి ఎంపిక చేసింది అని అంటారు. భగవానుడు పరమ భక్తితో చేసిన ఇటువంటి సేవలను స్వీకరిస్తారు, కావునా ఇలా వ్యాఖ్యానించటం లో తప్పు లేదు.

అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్

మూలం — https://granthams.koyil.org/2024/11/19/srirama-leela-aranya-kandam-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment