శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 7
పుండరికాక్షనే పరబ్రహ్మం (పుండరీకాక్షుడే పరమాత్మ )
చాందోగ్యోపనిషత్తులో పుండరీకాక్షుడే పరమాత్మ అని, ‘తస్య యదా కప్యాసం పుండరీకాక్షిణి’ అన్న వాక్యంలో చెప్పబడింది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు పరమాత్మను వర్ణించే సందర్భంలో ‘కః పుండ రీకాక్ష నయనః’ అని అన్నారు. కావున కమల నయనుడైన వాసుదేవుడే పరబ్రహ్మం అని శృతి వాక్యం.

వివరణలో వచ్చిన చర్చలు :

ఈ చాందోగ్యోపనిషత్తు శ్లోకం గురించి విస్తృత చర్చ జరిగింది. దీనికి యాదవ ప్రకాశులు పరమాత్మ కన్నులు ఎర్రగా మర్కటం పృష్ఠభాగం లాగా ఉంటుంది అని వివరించారు. ఈ వివరణ పరమాత్మను కించపరిచేదిగాను, తక్కువ చేసినదిగాను ఉంది. భగవద్రామానుజులకు మనఃక్లేశాన్ని కలిగించింది అని చరిత్ర .
శ్రీశంకరాచార్యుల వివరణ:
శ్రీశంకరాచార్యులు ఈ విషయంగా వివరిస్తూ పరమాత్మ కళ్ళను మర్కటం పృష్ఠభాగంతొ పోల్చరాదు అన్నారు. ఇంకా పరమాత్మ కళ్ళను తామరతో పోల్చతగినది అన్నారు. ఈ విధంగా శ్రీశంకరాచార్యులు పరమాత్మ కళ్ళను తామరతో పోల్చి పరమాత్మ పుండరీకాక్షుడని నిరూపించటం వలన ఉన్నతమైన పరమాత్మ లోని ఒక అవయవాన్ని నీచమైన మర్కటం పృష్ఠభాగంతొ పోల్చనీయకుండా విజయం సాధించారు, శృతి ఈ విషయంగా తామరను గురించి మాత్రం చెప్పితే సరిపోతుంది కదా, ఇంకా మర్కటం పృష్ఠభాగం గురించి ఎందుకు చెప్పిందని తృప్తికరంగా వివరించలేదు .
భగవద్రామానుజుల వివరణ:
కప్యాసం అన్న శబ్దం తామరకు ఎలా సరిపోతుందో వివరించి రామానుజులవారు ఈ చర్చకు ముగింపు చెప్పారు. అది ఎలాగంటే పరబ్రహ్మం పుండరీకాక్షుడని ప్రస్పుటంగా చెప్పటమే వేదాంతము యొక్క ఉద్దేశ్యము. మర్కటం పృష్ఠభాగం అన్న విరోధ భావానికి మారుగా ఉపనిషత్తు పరమాత్మ కళ్యాణ గుణాలను విభ్రమంగా చూసింది. భగవద్రామానుజుల చక్కటి వ్యాఖ్య వలన కుద్రుష్టుల భారి నుండి వేదాంతం తప్పించుకో కలిగింది.
భగవద్రామానుజులు అనుగ్రహించిన మూడు అర్థాలు;
- కం పిబతి ఇతి కపి= ఆదిత్యః తేన్ అస్త్యతే క్షిప్యతే వికాసతే ఇతి కప్యాసం

నీటిని తాగేది కపి. సూర్యుడు నీటిని పీల్చడం వలన కపి అని పిలవ బడుతున్నాడు. కప్యాసం అనగా సూర్యుడి వలన వికసింపచేసేది. తామరకు సంకేతంగా ఉండి అప్పుడే సూర్యుడిచే వికసింప బడిన తామర అన్న అర్థం వస్తుందని చెప్పారు.
- కం పిబతి ఇతి కపి= నాళం ,తస్మిన్ అస్తే ఇతి కప్యాసం .

కపి అంటే నీటిని తాగేది ఎదో అది కపి. తామర తూడు నీటిని తాగుతుంది అందు వలన అది కపి. కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉండి తూడుచే భరించ బడుతున్నదానిని చెపుతున్నది.
3. కం జలం ఆచ ఉపవేసనే ఇతి జలేపి ఆస్తే ఇతి కప్యాసం

కం అంటే జలము. నీటిలో నిలబడేది కప్యాసం. ఇక్కడ కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉన్న ఒక అందమైన తామర అని అర్థం .
ద్రమిడాచార్యులు తమ వ్యాఖ్యానంలో ఆరు అర్థాలను చెప్పినట్లు శ్రుత ప్రకాసిక వలన తెలుస్తున్నది. ఇందులో మూడు మర్కటం సంబందంగా ఉండటం వలన అవి పూర్వ పక్షం చేయబడ్డాయి. మిగిలిన మూడు పరబ్రహ్మాన్ని పుండరీకాక్షుడుగా చెప్పటం వలన అవి యుక్తముగా ఉన్నవని స్వీకరించబడ్డాయి. ఈ అర్థాలు రామానుజులచే అందంగా శృతి యుక్తంగా చక్కగా వివరించబడ్డాయి.
వేదర్తసంగ్రహంలో ఈ అర్థాలు చాలా సులభంగా చెప్పారు.
‘గంభీరాంపశ్చముద్భూత సమృష్ట నాళ రావికర వికసిత పుండరీక తలామలాయతేక్షణ ‘
‘ కప్యాసం’ అంటే పై పై అర్థం చూస్తే ఈవిశేష విషయాలు స్పురించవు. మరి రామానుజులు ఈ అర్థాలను ఎలా చెప్పారని ఆశ్చర్యం కలగడం సహజం. ఆళ్వార్ల శ్రీసూక్తులను అనుభవించటం వలననే ఈ అర్థాలు స్పురిస్తాయనడం లో సందేహం లేదు. ఆళ్వార్ల శ్రీసూక్తులలో ఈ విషయానికి సంబందించిన పాశురాలను అనుభవించి నప్పుడు ఈ విషయం చక్కగా బోధపడుతుంది.
రామానుజుల ఆళ్వార్ల శ్రీసూక్తులలో ఏ ఏ భాగాలను అవగాహన చేసుకొని ఈ వివరణ ఇచ్చారన్నది తరువాతి భాగాలలో అనుభావించవచ్చు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-8/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org